ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ల ఎక్కువయ్యారు. అమాయకులను ఆసరాగా చేసుకొని వారి దగ్గర నుంచి లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలను సృష్టించి ప్రేమపేరుతో కొందరి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. మరికొందరిని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ వారి దగ్గర లక్షల డబ్బులను లాగుతున్న ఓ కిలాడీ జంటను చివరికి పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మహబూబ్నగర్ జిల్లా కోస్గికి చెందిన పొన్నం నవీన్కుమార్, భార్య శిరీషతో కలిసి లింగంపల్లిలో నివసిస్తున్నారు వీరికి మూడు నెలల వయసున్న పాప ఉంది. ఈ క్రమంలోనే నవీన్ కుమార్ ఒక మెడికల్ షాప్ లో క్యాషియర్ గా పని చేస్తున్నారు. అయితే అక్కడ వచ్చే జీతం సరిపడకపోవడంతో ఈ విధమైనటువంటి మోసాలకు తెరలేపారు.ఈ క్రమంలోనే శ్వేతా అనే పేరుతో ఫేస్ బుక్ లో ఒక నకిలీ ఖాతాను సృష్టించారు.యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించారు. నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కాడు. ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని ఆ యువకుడికి మాయమాటలు చెప్పి సుమారు 8 లక్షల వరకు డబ్బులు లాగారు.
అదేవిధంగా ప్రేమ వల వేసి మరోక యువకుడి దగ్గర రూ.2.50 లక్షలు బదిలీ చేయించుకుంది. జూబ్లీహిల్స్కు చెందిన మరొకరిని మోసం చేసి రూ.2 లక్షల గుంజింది. ఈ విధంగా అందరి దగ్గర లక్షల్లో డబ్బులను లాగి ఉన్నఫలంగా ఫోన్ ఆఫ్ చేయడంతో బాధితులు హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వారిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వారిపై ఇదివరకే రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోనూ కేసులున్నాయని తెలియడంతో పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అదేవిధంగా వీరికి మూడు నెలల పాప ఉండడంతో శిరీషకు పోలీసులు నోటీసు ఇచ్చి పంపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…