ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ల ఎక్కువయ్యారు. అమాయకులను ఆసరాగా చేసుకొని వారి దగ్గర నుంచి లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలను సృష్టించి ప్రేమపేరుతో కొందరి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. మరికొందరిని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ వారి దగ్గర లక్షల డబ్బులను లాగుతున్న ఓ కిలాడీ జంటను చివరికి పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మహబూబ్నగర్ జిల్లా కోస్గికి చెందిన పొన్నం నవీన్కుమార్, భార్య శిరీషతో కలిసి లింగంపల్లిలో నివసిస్తున్నారు వీరికి మూడు నెలల వయసున్న పాప ఉంది. ఈ క్రమంలోనే నవీన్ కుమార్ ఒక మెడికల్ షాప్ లో క్యాషియర్ గా పని చేస్తున్నారు. అయితే అక్కడ వచ్చే జీతం సరిపడకపోవడంతో ఈ విధమైనటువంటి మోసాలకు తెరలేపారు.ఈ క్రమంలోనే శ్వేతా అనే పేరుతో ఫేస్ బుక్ లో ఒక నకిలీ ఖాతాను సృష్టించారు.యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించారు. నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కాడు. ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని ఆ యువకుడికి మాయమాటలు చెప్పి సుమారు 8 లక్షల వరకు డబ్బులు లాగారు.
అదేవిధంగా ప్రేమ వల వేసి మరోక యువకుడి దగ్గర రూ.2.50 లక్షలు బదిలీ చేయించుకుంది. జూబ్లీహిల్స్కు చెందిన మరొకరిని మోసం చేసి రూ.2 లక్షల గుంజింది. ఈ విధంగా అందరి దగ్గర లక్షల్లో డబ్బులను లాగి ఉన్నఫలంగా ఫోన్ ఆఫ్ చేయడంతో బాధితులు హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వారిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వారిపై ఇదివరకే రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోనూ కేసులున్నాయని తెలియడంతో పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అదేవిధంగా వీరికి మూడు నెలల పాప ఉండడంతో శిరీషకు పోలీసులు నోటీసు ఇచ్చి పంపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…