తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం కేసీఆర్ హుజారాబాద్లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. 1-2 నెలల్లో ఆ నియోజకవర్గంలోని దళితుందరికీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పారు. 4 ఏళ్లలో రాష్ట్రంలోని 17 లక్షలకు పైగా దళిత కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు.
అయితే తెరాస ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని, పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తాజాగా ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రజలు సంక్షేమ పథకాలను పొందేందుకు తమకు దరఖాస్తులను అందజేయాలని, వాటిని ప్రభుత్వానికి తాము అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ ట్వీట్ కూడా చేశారు.
అయితే ఆ ట్వీట్కు రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ వేశారు. ప్రధాని మోదీ దేశంలోని అర్హులైన ప్రజలందరి అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని అధికారంలోకి వచ్చారని, కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని, కనుక ప్రజలు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరుతూ బీజేపీకి అప్లికేషన్లను ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…