రాష్ట్రంలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కిలో చికెన్ ధర దాదాపు 250 నుంచి 300 వరకు ధర పలుకుతోంది. ఈ విధంగా చికెన్ ధరలు ఉన్నఫలంగా పెరగటంతో సామాన్య ప్రజలకు చికెన్ కూడా అందని ద్రాక్ష పండులా మారిపోయింది. మార్కెట్లో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నప్పటికీ పౌల్ట్రీ రైతులకు మాత్రం ఏ విధమైన లాభం రావడం లేదు. ఈ పౌల్ట్రీ వెనుక అతిపెద్ద మాఫియా జరుగుతోందని, అందుకే తమ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కలేదని రైతులు వాపోతున్నారు.
మార్కెట్లో బర్డ్ రేటు కిలో రూ. 180 దాకా ఉంటుందని, కానీ దళారులు మాత్రం తమకు కేవలం రూ.120 మాత్రమే చెల్లిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడి పిల్లలకు, దానాకు లక్షల్లో ఖర్చు చేసి 45 రోజుల పాటు వాటిని సంరక్షిస్తే తమకు ఎంత వస్తుందో… అంతే దళారులు కూడా లాభం పొందుతున్నారని తెలిపారు.
ట్రేడర్లు కంపెనీ మాయాజాలం కారణంగా రాష్ట్రంలో దాదాపు 70 శాతం పౌల్ట్రీ రైతులు ఇంటిగ్రేషన్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయారు. అంటే చికెన్ విక్రయించే రైతులు వారి పౌల్ట్రీ ఫారాలను సదరు కంపెనీలు లీజుకు తీసుకుని, ఆ పౌల్ట్రీ ఫామ్ లో రైతులను కూలీలుగా మార్చేస్తున్నారు. కంపెనీ సప్లై చేసే కోడి పిల్లలు, దాన ఆధారంగా వాటిని పెంచి పెద్ద చేస్తే వారికి కూలి రూపంలో చెల్లిస్తున్నారు. ఇందుకోసం కంపెనీ రైతులకు కిలో కు ఐదు నుంచి ఆరు రూపాయల చొప్పున మాత్రమే చెల్లిస్తోంది. ఈ విధంగా పౌల్ట్రీ రైతులను ఇంటిగ్రేట్ సిస్టమ్ లోకి మార్చుకొని చికెన్ ధరలను అమాంతం పెంచుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…