పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. హీరోయిన్ అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు తొలిసారిగా పరిచయం అయింది. ఈ చిత్రంలో మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని దక్కించుకుంది. రూ.120 కోట్లకు పైగా ఖర్చుపెట్టిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు తమదైన శైలిలో విమర్శలతో దాడి చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన యాక్షన్ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్ కూడా ఉంటుంది. అతిగా ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదుర్కోవలసి వస్తుంది. హీరోలు మా సినిమాను చూడండి అని ప్రమోట్ చేయాలే తప్ప, ఊపేస్తాం.. తగలెడతాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తే ఇదేవిధంగా ప్రేక్షకులు మనల్ని తగలెడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ సినిమా డిజాస్టర్కు కారణాలు ఏమై ఉంటాయి అని తమ్మారెడ్డి భరద్వాజ్ ను ప్రశ్నించగా, ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను కూడా పూరి జగన్నాథ్ కు పెద్ద అభిమానిని. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే నాకు చిత్రం చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే సినిమా చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. బాయ్ కాట్ ట్రెండ్పై భరద్వాజ రియాక్ట్ అవుతూ, ఒక సినిమా వచ్చిందంటే చాలు .. నూటికి 95 శాతం తమ సోషల్ మీడియా లైకుల కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు క్రియేట్ చేస్తూ ప్రచారం చేస్తారు. ఇలాంటి వార్తలను అసలు పట్టించుకోను అవసరమే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కేవలం ఐదు శాతమే ఉంది. 95 శాతం సినిమాలు ఆడటం లేదన్నారు. ఎంతో మంది నిర్మాతలు పూట గడవని స్థితిలో ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…