పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. హీరోయిన్ అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు తొలిసారిగా పరిచయం అయింది. ఈ చిత్రంలో మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని దక్కించుకుంది. రూ.120 కోట్లకు పైగా ఖర్చుపెట్టిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు తమదైన శైలిలో విమర్శలతో దాడి చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన యాక్షన్ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్ కూడా ఉంటుంది. అతిగా ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదుర్కోవలసి వస్తుంది. హీరోలు మా సినిమాను చూడండి అని ప్రమోట్ చేయాలే తప్ప, ఊపేస్తాం.. తగలెడతాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తే ఇదేవిధంగా ప్రేక్షకులు మనల్ని తగలెడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ సినిమా డిజాస్టర్కు కారణాలు ఏమై ఉంటాయి అని తమ్మారెడ్డి భరద్వాజ్ ను ప్రశ్నించగా, ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను కూడా పూరి జగన్నాథ్ కు పెద్ద అభిమానిని. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే నాకు చిత్రం చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే సినిమా చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. బాయ్ కాట్ ట్రెండ్పై భరద్వాజ రియాక్ట్ అవుతూ, ఒక సినిమా వచ్చిందంటే చాలు .. నూటికి 95 శాతం తమ సోషల్ మీడియా లైకుల కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు క్రియేట్ చేస్తూ ప్రచారం చేస్తారు. ఇలాంటి వార్తలను అసలు పట్టించుకోను అవసరమే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కేవలం ఐదు శాతమే ఉంది. 95 శాతం సినిమాలు ఆడటం లేదన్నారు. ఎంతో మంది నిర్మాతలు పూట గడవని స్థితిలో ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…