Turmeric : పసుసును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. అయితే వాస్తవానికి దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పసుపు అనేక వ్యాధులను నయం చేసే వర ప్రదాయని అని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలోనే పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పసుపులో ఉండే కర్క్యుమిన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. డిప్రెషన్ నుంచి బయట పడేస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
2. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల గుండె సురక్షితంగా ఉంటుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్లు రాకుండా చూసుకోవచ్చు.
3. పాలలో పసుపు కలుపుకుని తాగితే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందవు. అలాగే క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
4. పసుపులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక పసుపును పాలలో కలిపి తాగితే కీళ్లనొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
5. పసుపును తీసుకుంటే మతిమరుపు సమస్య తగ్గుతుంది. దీన్ని గాయాలు, పుండ్లపై రాస్తే త్వరగా అవి మానుతాయి. అలాగే పాలలో పసుపు కలిపి తాగడం వల్ల షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్, హైబీపీ తగ్గుతాయి. అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…