T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 15వ మ్యాచ్లో బంగ్లాదేశ్పై శ్రీలంక విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని శ్రీలంక సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్పై లంక జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో మహమ్మద్ నయీమ్, ముష్ఫికుర్ రహీంలు అద్భుతంగా రాణించారు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేసి నయీం ఫెర్నాండో బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అలాగే 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో రహీం 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నె, బినురా ఫెర్నాండో, లాహిరు కుమారలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 172 పరుగులు చేసింది. లంక బ్యాట్స్మెన్లలో చరిత్ అసలంక అద్భుతంగా రాణించాడు. 49 బంతులు ఆడిన అసలంక 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. లంకకు విజయాన్ని అందించాడు. అలాగే మరో బ్యాట్స్మన్ భానుక రాజపక్స 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లలో నసుమ్ అహ్మద్, షకిబ్ అల్ హసన్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. మహమ్మద్ సయిఫుద్దీన్ 1 వికెట్ తీశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…