T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 15వ మ్యాచ్లో బంగ్లాదేశ్పై శ్రీలంక విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని శ్రీలంక సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్పై లంక జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో మహమ్మద్ నయీమ్, ముష్ఫికుర్ రహీంలు అద్భుతంగా రాణించారు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేసి నయీం ఫెర్నాండో బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అలాగే 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో రహీం 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నె, బినురా ఫెర్నాండో, లాహిరు కుమారలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 172 పరుగులు చేసింది. లంక బ్యాట్స్మెన్లలో చరిత్ అసలంక అద్భుతంగా రాణించాడు. 49 బంతులు ఆడిన అసలంక 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. లంకకు విజయాన్ని అందించాడు. అలాగే మరో బ్యాట్స్మన్ భానుక రాజపక్స 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లలో నసుమ్ అహ్మద్, షకిబ్ అల్ హసన్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. మహమ్మద్ సయిఫుద్దీన్ 1 వికెట్ తీశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…