T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కష్టపడి ఛేదించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో మొయిన్ అలీ అర్ధ సెంచరీతో రాణించాడు. 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలీ 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో డేవిడ్ మలన్ 41 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నె, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ లు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 167 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో డారిల్ మిచెల్, డివాన్ కాన్వేలు రాణించారు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో మిచెల్ 73 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే కాన్వే 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 46 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్ స్టోన్లు చెరో 2 వికెట్ల చొప్పున తీయగా, ఆదిల్ రషీద్కు 1 వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో విజయంతో న్యూజిలాండ్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 11వ తేదీన రాత్రి 7.30 గంటలకు దుబాయ్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన వారు కివీస్తో ఈ నెల 14వ తేదీన దుబాయ్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో తలపడతారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…