T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కష్టపడి ఛేదించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో మొయిన్ అలీ అర్ధ సెంచరీతో రాణించాడు. 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలీ 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో డేవిడ్ మలన్ 41 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నె, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ లు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 167 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో డారిల్ మిచెల్, డివాన్ కాన్వేలు రాణించారు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో మిచెల్ 73 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే కాన్వే 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 46 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్ స్టోన్లు చెరో 2 వికెట్ల చొప్పున తీయగా, ఆదిల్ రషీద్కు 1 వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో విజయంతో న్యూజిలాండ్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 11వ తేదీన రాత్రి 7.30 గంటలకు దుబాయ్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన వారు కివీస్తో ఈ నెల 14వ తేదీన దుబాయ్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో తలపడతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…