Balakrishna : గత కొద్ది నెలలుగా ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో లాబీయింగ్ చేసింది. అయినప్పటికీ రేట్లను తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆ రాష్ట్రంలో విడుదల కానున్న సినిమాలపై టిక్కెట్ల ధరల ప్రభావం పడనుంది. టిక్కెట్ల ధరలను తగ్గిస్తే వచ్చే ఆదాయం తగ్గుతుంది కనుక బయ్యర్లు కూడా తాము సినిమా కొన్న ధరలో 30 శాతం తగ్గింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే నిర్మాతలు బయ్యర్లతో చర్చలు జరిపి ఆ మొత్తాన్ని 20 శాతానికి తగ్గించారు. దీంతో అంతిమంగా నిర్మాతలకు నష్టం రానుంది. ఇక ఈ విధానం వల్ల మొదటగా ఎఫెక్ట్ పడేది బాలయ్య సినిమా పైనే. డిసెంబర్ లో ముందుగా ఆయన సినిమానే విడుదల కానుంది. ఇప్పటికే ఆ మూవీని ఆంధ్రాలో రూ.35 కోట్లకు, సీడెడ్ ఏరియాల్లో రూ.12 కోట్లకు అమ్మారు. ఆ మొత్తంలో 20 శాతం మేర అంటే.. దాదాపుగా రూ.9.40 కోట్ల మేర అఖండ నిర్మాతలు నష్టపోనున్నారు.
అయితే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి టిక్కెట్ల ధరలను పెంచకపోతే మాత్రం ఆ ప్రభావం ఇతర సినిమాలపై కూడా పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే రానున్న 2 నెలల్లో విడుదలయ్యే పలు సినిమాల నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్ల మేర నష్ట పోతారని లెక్కలు వేస్తున్నారు.
రానున్న నెలల్లో అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వంటి మూవీలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీల నిర్మాతలు రూ.70 కోట్ల మేర నష్టపోతారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…