T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 21వ మ్యాచ్లో స్కాట్లండ్పై నమీబియా విజయం సాధించింది. స్కాట్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని నమీబియా తడబడుతూ ఛేదించింది. ఈ క్రమంలో స్కాట్లండ్పై నమీబియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన నమీబియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా స్కాట్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో స్కాట్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. స్కాట్లండ్ బ్యాట్స్మెన్లలో మైకేల్ లియాస్క్ 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. 27 బంతులు ఆడిన మైకేల్ 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అలాగే క్రిస్ గ్రీవ్స్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్మన్ 3 వికెట్లు తీయగా, జాన్ ఫ్రైలింక్ 2 వికెట్లు తీశాడు. జేజే స్మిట్, డేవిడ్ వెయెసెలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నమీబియా 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్లను కోల్పోయి 115 పరుగులు చేసింది. నమీబియా బ్యాట్స్మెన్లలో జేజే స్మిట్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. 23 బంతులు ఆడిన స్మిట్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. క్రెయిగ్ విలియమ్స్ అనే మరో బ్యాట్స్మన్ 23 పరుగులు చేయగా.. అందులో 1 సిక్స్ ఉంది. స్కాట్లండ్ బౌలర్లలో మైకేల్ లియాస్క్ 2 వికెట్లు తీశాడు. బ్రాడ్ వియల్, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్లకు తలా 1 వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…