T20 World Cup 2021 : దుబాయ్లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 37వ మ్యాచ్లో స్కాట్లండ్పై భారత్ ఘన విజయం సాధించింది. స్కాట్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ చాలా స్వల్ప వ్యవధిలోనే ఛేదించింది. 86 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే భారత్ సాధించింది. దీంతో స్కాట్లండ్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. స్కాట్లండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు 17.4 ఓవర్లలోనే కేవలం 85 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్కాట్లండ్ బ్యాట్స్మెన్లలో జార్జ్ మున్సీ 24 పరుగులు, మైకేల్ లియాస్క్ 21 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు చెరో 3 వికెట్లను తీశారు. జస్ప్రిత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను కోల్పోయి 89 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్ 50 పరుగులతో చెలరేగిపోయాడు. రోహిత్ శర్మ 30 పరుగులు చేశాడు. స్కాట్లండ్ బౌలర్లలో మార్క్ వాట్, బ్రాడ్ వియల్లు చెరొక వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…