Puneeth Rajkumar : పునీత్ మరణించి అప్పుడే వారం రోజులు అవుతోంది. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణ వార్త విన్న కొందరు అభిమానులు ఆత్మహత్యలు చేసుకోగా, ఇంకొందరు గుండెపోటుతో మరణించారు. రీసెంట్గా కోడిపాళ్యకు చెందిన భరత్(30) మంగళవారం ఉరివేసుకుని ‘అప్పుని’ కలవడానికి వెళుతున్నాను.. అంటూ రక్తంతో సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అతని కోరిక మేరకు కుటుంబ సభ్యులు అతని కళ్లను దానం చేశారు.
పునీత్ మరణాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ఆయన తన సేవా కార్యక్రమాలతో అందరి మనసులలోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. పునీత్ మరణించిన సమయంలో టాలీవుడ్కి సంబంధించి పలువురు ప్రముఖులు ఆయన పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో రాలేకపోయిన నటుడు సూర్య.. తాజాగా పునీత్ సమాధి దగ్గర పూలు చల్లి నివాళులు అర్పించారు. ఆయన లేడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇటీవల పునీత్ మృతిపై తమిళ హీరోలు ఎవరూ స్పందించడం లేదని ఓ వ్యక్తి విజయ్ సేతుపతిపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్య సందర్శించడం ఆసక్తికరంగా మారింది. కాగా.. ఇటీవలే హీరో నాగార్జున, రామ్ చరణ్ లు కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. పునీత్ లేని లోటు పూడ్చలేనిదంటూ నాగార్జున, రామ్ చరణ్ అన్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…