T20 World Cup 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా యూఏఈలో జరగుతున్న వార్మప్ మ్యాచ్లలో భారత్ సత్తా చాటింది. మొదట ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించగా.. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఇంకో వార్మప్ మ్యాచ్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో స్టీవెన్ స్మిత్, మార్క్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్వెల్లు రాణించారు. 48 బంతులు ఆడిన స్మిత్ 7 ఫోర్లతో 57 పరుగులు చేయగా, 25 బంతులు ఆడిన స్టాయినిస్ 4 ఫోర్లు, 1 సిక్సర్తో 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరో బ్యాట్స్మన్ మ్యాక్స్వెల్ 28 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్ తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదించింది. 17.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 38 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్మన్ హార్దిక్ పాండ్యా 8 బంతుల్లో 1 సిక్సర్తో 14 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో అగర్ 1 వికెట్ తీశాడు.
కాగా వరల్డ్ కప్లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ను ఈ నెల 24వ తేదీన పాకిస్థాన్తో ఆడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…