T20 World Cup 2021 : యూఏఈలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ టోర్నీలో ప్రస్తుతం క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అసలు మ్యాచ్లు ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతాయి. ఇక భారత్ 24వ తేదీన పాకిస్థాన్ తో తలపడనుంది. అయితే సోమవారం భారత్, ఇంగ్లండ్ల మధ్య దుబాయ్లో వార్మప్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ను ఎంచుకోగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జానీ బెయిర్స్టో (49 పరుగులు), మొయిన్ అలీ (43), లివింగ్ స్టోన్ (30)లు రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు తీయగా, బుమ్రా, రాహుల్ చాహర్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ అలవోకగా విజయం సాధించింది. ఏ దశలోనూ బ్యాట్స్మెన్ తడబడలేదు. ఈ క్రమంలో భారత్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 192 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లు అద్భుతంగా రాణించారు. 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో రాహుల్ 51 పరుగులు చేయగా, 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో ఇషాన్ కిషన్ 70 పరుగులు చేశాడు. అలాగే రిషబ్ పంత్ (29 పరుగులు) కూడా రెచ్చిపోయాడు. దీంతో భారత్ సునాయాసంగానే విజయం సాధించింది. ఇంగ్లండ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, లియామ్ లివింగ్ స్టోన్లకు తలా 1 వికెట్ దక్కింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…