T20 World Cup 2021 : యూఏఈలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ టోర్నీలో ప్రస్తుతం క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అసలు మ్యాచ్లు ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతాయి. ఇక భారత్ 24వ తేదీన పాకిస్థాన్ తో తలపడనుంది. అయితే సోమవారం భారత్, ఇంగ్లండ్ల మధ్య దుబాయ్లో వార్మప్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ను ఎంచుకోగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జానీ బెయిర్స్టో (49 పరుగులు), మొయిన్ అలీ (43), లివింగ్ స్టోన్ (30)లు రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు తీయగా, బుమ్రా, రాహుల్ చాహర్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ అలవోకగా విజయం సాధించింది. ఏ దశలోనూ బ్యాట్స్మెన్ తడబడలేదు. ఈ క్రమంలో భారత్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 192 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లు అద్భుతంగా రాణించారు. 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో రాహుల్ 51 పరుగులు చేయగా, 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో ఇషాన్ కిషన్ 70 పరుగులు చేశాడు. అలాగే రిషబ్ పంత్ (29 పరుగులు) కూడా రెచ్చిపోయాడు. దీంతో భారత్ సునాయాసంగానే విజయం సాధించింది. ఇంగ్లండ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, లియామ్ లివింగ్ స్టోన్లకు తలా 1 వికెట్ దక్కింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…