T20 World Cup 2021 : దుబాయ్లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 26వ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ చాలా సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ క్రీజులో నిలబడకలేకపోయారు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఒక్కడే 44 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన కూడా చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్లు చెరో 2 వికెట్లు తీశారు. ఆదిల్ రషీద్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. 2 వికెట్లను కోల్పోయి 126 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జాస్ బట్లర్ 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, జేసన్ రాయ్ 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్తో 22 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో ఆష్టాన్ అగర్, ఆడమ్ జంపాలు చెరొక వికెట్ తీశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…