Jio : బ్రాడ్బ్యాండ్ రంగంలో ప్రస్తుతం జియో, ఎయిర్టెల్తోపాటు యాక్ట్ ఫైబర్ కూడా టాప్ పొజిషన్లో ఉన్నాయి. అయితే త్వరలో ఈ కంపెనీలకు షాక్ తగలనుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో మరో కంపెనీ మన దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలుసు కదా. ఆయనకు అనేక కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో స్టార్ లింక్ అనే శాటిలైట్ కంపెనీ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ పలు దేశాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. అయితే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి ఈ కంపెనీ మన దేశంలోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. అందుకుగాను ఇప్పటికే ఈ కంపెనీ రిజిస్టర్ చేసుకుంది కూడా.
ఇక స్టార్ లింక్ కంపెనీ ప్రస్తుతం హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను పలు ఎంపిక చేసిన చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. రూ.7350 చెల్లించిన వారికి ఇంటర్నెట్ కనెక్షన్ను ఇస్తారు. వారికి 50 నుంచి 150 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. ప్రస్తుతం ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.
అయితే స్టార్ లింక్ కంపెనీకి విదేశాల్లో మంచి పేరుంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీ భారత్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ముందుకు రావడం ఇతర కంపెనీలకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా జియో, ఎయిర్ టెల్ కంపెనీలు అందిస్తున్న ఇంటర్నెట్ సేవలపై ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి స్టార్ లింక్ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…