Jio : బ్రాడ్బ్యాండ్ రంగంలో ప్రస్తుతం జియో, ఎయిర్టెల్తోపాటు యాక్ట్ ఫైబర్ కూడా టాప్ పొజిషన్లో ఉన్నాయి. అయితే త్వరలో ఈ కంపెనీలకు షాక్ తగలనుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో మరో కంపెనీ మన దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలుసు కదా. ఆయనకు అనేక కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో స్టార్ లింక్ అనే శాటిలైట్ కంపెనీ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ పలు దేశాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. అయితే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి ఈ కంపెనీ మన దేశంలోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. అందుకుగాను ఇప్పటికే ఈ కంపెనీ రిజిస్టర్ చేసుకుంది కూడా.
ఇక స్టార్ లింక్ కంపెనీ ప్రస్తుతం హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను పలు ఎంపిక చేసిన చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. రూ.7350 చెల్లించిన వారికి ఇంటర్నెట్ కనెక్షన్ను ఇస్తారు. వారికి 50 నుంచి 150 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. ప్రస్తుతం ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.
అయితే స్టార్ లింక్ కంపెనీకి విదేశాల్లో మంచి పేరుంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీ భారత్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ముందుకు రావడం ఇతర కంపెనీలకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా జియో, ఎయిర్ టెల్ కంపెనీలు అందిస్తున్న ఇంటర్నెట్ సేవలపై ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి స్టార్ లింక్ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…