Suriya Jai Bhim : తమిళం హీరోలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి దాడి చేయగా ఆయనపై దాడి చేసిన వారికి వెయ్యి రూపాయల బహుమానం అంటూ.. హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్ ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా హీరో సూర్యపై దాడి చేస్తే లక్ష రూపాయలు బహుమానం అందిస్తామని.. పీఎంకే పార్టీ నేత మైలాడుతురై, జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం ప్రకటించారు.
అయితే ఈ విధంగా ప్రకటన చేయడానికి కారణం ఉంది. సూర్య నటించిన జై భీమ్ చిత్రంలో సూర్య ఒక దళిత వర్గానికి చెందిన మహిళ ఎదుర్కొన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు.. అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. 1995వ సంవత్సరంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా చూపించారని.. అల్లర్లు, గొడవలు సృష్టించేలా సినిమా ఉందని.. పీఎంకే పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. అలాగే సూర్య ఐదు కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఎవరైతే హీరో సూర్యపై దాడి చేస్తారో వారికి రూ.1 లక్ష బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఆ పార్టీ అధినేత ఈ విధమై బహిరంగ ప్రకటన చేయడంతో కొందరు ఈ విషయంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సూర్యకు చాలా మంది మద్దతు ఇస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…