Suresh Babu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంపై తీసుకున్న నిర్ణయం పట్ల చిత్ర పరిశ్రమ ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు సెలబ్రిటీలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్లను అమ్మాల్సి ఉంటుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని ఏపీ ప్రభుత్వం చెప్పడంతో ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం గురించి మరో సారి పునరాలోచన చేయాలని తెలిపారు.
ఇప్పటికే ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రిని వేడుకోగా తాజాగా ఈ విషయంపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. మార్కెట్లో అన్ని వస్తువులకూ ఒకే ధర ఉండదని, ఒక్కో వస్తువుకు ఒక్కో ధర ఉన్నట్లుగానే చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి చాలా తేడా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు ఒకే విధమైన టికెట్ ధరలను నిర్ణయించడం వల్ల పెద్ద సినిమా నిర్మాతలు చాలా నష్టపోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
బ్లాక్ టికెట్స్ ను కంట్రోల్ చేయడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే పూర్తిగా నిర్మాతలు నష్టపోతారని టికెట్స్ కేవలం రెండు మూడు రోజులు మాత్రమే అమ్ముతారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెయ్యి కోట్ల పెట్టుబడిలేనటువంటి చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఈ విధమైనటువంటి నిబంధనలు పెట్టడం సరికాదని, ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ఈ సందర్భంగా సురేష్ బాబు కోరారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…