Suresh Babu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంపై తీసుకున్న నిర్ణయం పట్ల చిత్ర పరిశ్రమ ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు సెలబ్రిటీలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్లను అమ్మాల్సి ఉంటుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని ఏపీ ప్రభుత్వం చెప్పడంతో ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం గురించి మరో సారి పునరాలోచన చేయాలని తెలిపారు.
ఇప్పటికే ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రిని వేడుకోగా తాజాగా ఈ విషయంపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. మార్కెట్లో అన్ని వస్తువులకూ ఒకే ధర ఉండదని, ఒక్కో వస్తువుకు ఒక్కో ధర ఉన్నట్లుగానే చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి చాలా తేడా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు ఒకే విధమైన టికెట్ ధరలను నిర్ణయించడం వల్ల పెద్ద సినిమా నిర్మాతలు చాలా నష్టపోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
బ్లాక్ టికెట్స్ ను కంట్రోల్ చేయడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే పూర్తిగా నిర్మాతలు నష్టపోతారని టికెట్స్ కేవలం రెండు మూడు రోజులు మాత్రమే అమ్ముతారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెయ్యి కోట్ల పెట్టుబడిలేనటువంటి చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఈ విధమైనటువంటి నిబంధనలు పెట్టడం సరికాదని, ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ఈ సందర్భంగా సురేష్ బాబు కోరారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…