Sirivennela : ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందుతోంది. దీంతో ఆయనను హైదరాబాద్లోని కిమ్స్ హస్పిటల్లో చేర్పించినట్లు తెలిసింది. 2 రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురి కావడంతో కిమ్స్కు చెందిన ప్రముఖ డాక్టర్లు ఆయనకు వైద్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇదే విషయంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. న్యుమోనియాతోనే ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని.. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
కాగా విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన డా.సి.వి.యోగి, సుబ్బలక్ష్మి లకు చేంబోలు సీతారామశాస్త్రి జన్మించారు. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ కోసం కాకినాడ వెళ్లారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. తెలుగు భాషపై మంచి గ్రిప్ ఉండడంతో.. ఎంఏ చదువుతుండగానే ఆయనకు అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు. తరువాత ఆయన సిరివెన్నెల పేరిట సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు.
ఇప్పటి వరకు ఆయన 3వేలకు పైగా పాటలు రాశారు. 10 నంది అవార్డులు ఆయనను వరించాయి. 3 ఫిలిం ఫేర్ అవార్డులు పొందారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని పాటలు ఎవర్ గ్రీన్ గా పేరుగాంచాయి. ముఖ్యంగా గాయం సినిమాలో ఆయన రాసిన నిగ్గదీసి అడుగు పాటతోపాటు క్రిమినల్ సినిమాలో తెలుసా, మనసా.. అలాగే మహర్షిలో సాహసం నా పథం.. ఇలా అనేక వందల సంఖ్యలో సిరివెన్నెల పాటలు ఎంతగానో పేరుగాంచాయి.
కాగా చివరి సారిగా ఆయన కొండపొలం మూవీలో తలఎత్తు అనే సాంగ్ ని షేర్ చేశారు. అందులో లిరిక్స్ ను అభిమానులతో పంచుకున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…