Jacqueline Fernandez : శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుమారుగా 14 మందిని మోసం చేసి రూ.200 కోట్లు కొల్లగొట్టాడని సుకేష్ చంద్రశేఖర్పై అభియోగం ఉండగా, ఇప్పుడు అతనితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆమె మళ్లీ చిక్కుల్లో పడ్డట్టే.. అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో విచారణకు గాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు మార్లు జాక్వెలిన్ కు నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే విచారణకు హాజరైంది.
మిగిలిన సందర్భాల్లో షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు సాకుగా చెబుతూ డుమ్మా కొట్టింది. అయితే ఈడీ మాత్రం సుఖేష్కి ఏయే సెలెబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయి, వారితో సుఖేష్ ఎలాంటి డీల్స్ కుదుర్చుకున్నాడు అనే కోణంలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ముందుగా సుఖేష్ తో జాక్వెలిన్, నోరా ఫతేహి లాంటి సెలెబ్రిటీలు రిలేషన్ కొనసాగించినట్లు తెలుస్తోంది. సుఖేష్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన సమయంలో ఏప్రిల్ – జూన్ కాలంలో ఈ సెల్ఫీ తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుఖేష్.. జాక్వెలిన్ను చెన్నైలో దాదాపు నాలుగుసార్లు కలిశాడని, అంతేకాకుండా జాక్వెలిన్కు ప్రైవేటు జెట్ ను కూడా ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలతో జాక్వెలిన్కి కష్టాలు తప్పేలా లేవు. ఈ అమ్మడు పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…