Suhana Khan : సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల వారసులు తెరపై సందడి చేస్తుంటారు. అయితే వారి లక్ బాగుంటే స్టార్లుగా మారుతారు. లేదంటే ఒకటి రెండు సినిమాలు చేసి వెండితెరకు దూరమవుతుంటారు. అలాంటి వారిని గతంలో మనం చాలా సార్లు చూశాం. ఇక బాలీవుడ్లో అయితే చాలా మంది వారసులు ఇప్పటికే వెండి తెరపై అరంగేట్రం చేశారు. కానీ షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మాత్రం ఇంకా బాలీవుడ్ కు పరిచయం కాలేదు. అయితే త్వరలోనే ఆమె ఓ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కానుందని తెలుస్తోంది.
ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, చుంకీ పాండే కుమార్తె అనన్య పాండేలు ఇప్పటికే హీరోయిన్స్గా మారి రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో సుహానా ఖాన్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జోయా అక్తర్.. సుహానా ఖాన్ను బాలీవుడ్కు పరిచయం చేయనున్నాడట. ఈ క్రమంలోనే జోయా అక్తర్ ఆఫీస్కి సైతం సుహానా వెళ్లింది. వారు తాము చేయబోయే సినిమా కథకు సంబంధించి చర్చలు జరిపారట. దీంతో సుహానా ఖాన్ త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.
సుహానా ఖాన్ ఇది వరకే ఓ షార్ట్ ఫిలింలో నటించి అలరించింది. ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ టైటిల్తో తెరకెక్కిన సదరు ఫిలింలో ఆమె నటించింది. ప్రస్తుతం లండన్ యూనివర్సిటీలో ఆమె విద్యను అభ్యసిస్తోంది. ఫిలిం మేకింగ్కు సంబంధించి పలు కోర్సులను కూడా ఈమె చేసింది. త్వరలోనే విద్యాభ్యాసం ముగించుకుని సొంత దేశానికి వస్తుందని, దీంతో ఆమె వెండి తెరకు పరిచయం అవుతుందని తెలుస్తోంది. అయితే సుహానా ఖాన్ ఇప్పటికే గ్లామర్గా కనిపిస్తూ పలు మార్లు ఫొటోలను షేర్ చేసింది. ఇంకా సినిమాల్లోకి రాకముందే ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ కనిపిస్తుంటుంది. మరి సినిమాల్లోకి వచ్చాక ఎలా రచ్చ చేస్తుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…