Muniyandi Temple : మటన్ బిర్యానీ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరు మటన్ కూర కన్నా మటన్ బిర్యానీ అంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లోనూ కొందరు మటన్ బిర్యానీ పెడుతుంటారు. అయితే ఆ ఆలయంలో ప్రసాదంగా కూడా మటన్ బిర్యానీని పెడుతున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది ? దాని విశిష్టత ఏమిటి ? అంటే..
తమిళనాడులోని మదురైలో మునియంది ఆలయం ఉంది. అక్కడ ఆలయంలో మునియంది స్వామి కొలువై ఉన్నాడు. అయితే అక్కడి భక్తులు స్వామి వారికి మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడతారు. దీని వెనుక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే..
1973లో మదురై జిల్లాలోని వడకంపట్టి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హోటల్ వ్యాపారం ప్రారంభించాడు. అది ఎంతో సక్సెస్ అయింది. దీంతో ఎంతో సంతోషం చెందిన ఆ వ్యాపారి ఆ స్వామి వారికి మటన్ బిర్యానీ వండి ప్రసాదంగా పెట్టాడు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి చాలా మంది అలా మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడుతూ వస్తున్నారు. ఆ ఆచారం ఇప్పటికీ అలాగే వస్తోంది.
ఇక ప్రతి ఏడాది ఈ సమయంలో అక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. అందులో ఎన్నో వేల మంది పాల్గొంటారు. ఈ సారి అక్కడ 8000 మంది వరకు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ స్వామి వారికి మటన్ బిర్యానీని ప్రసాదంగా సమర్పించారు.
ఆలయంలోనూ ఉత్సవాల సమయంలో మటన్ బిర్యానీని తయారు చేసి ప్రసాదంగా భక్తులకు పెడతారు. అందుకు గాను 4000 కిలోల బియ్యం, 100 మేకలు, 600 కోళ్లను ఉపయోగిస్తారు. కోళ్లతో కూర చేసి మటన్ బిర్యానీతో కలిపి పెడతారు.
కాగా ఈ ఆలయంలో మటన్ బిర్యానీని ప్రసాదంగా సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని, వ్యాపారం ఏది చేసినా.. అది సక్సెస్ అవుతుందని నమ్ముతుంటారు. అందుకనే చాలా మంది ఇక్కడికి వచ్చి మటన్ బిర్యానీ సమర్పిస్తుంటారు. ఇక దక్షిణ భారత దేశంలో ఈ స్వామి పేరిట 500 మునియంది హోటల్స్ ను కూడా పలు చోట్ల నిర్వహిస్తుండడం విశేషం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…