Sudigali Sudheer : బుల్లితెరపై అత్యంత సక్సెస్ను సాధించిన షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోకు వచ్చిన రేటింగ్స్ ఇప్పటి వరకు ఏ షోకు కూడా రాలేదనే చెప్పాలి. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్ షో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కంటెస్టెంట్లు అందరూ ఒక్కొక్కరుగా ఈ షోకు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, ఆది, గెటప్ శ్రీను దూరమయ్యారు. రోజా స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేసినా.. యాంకర్గా అనసూయ కూడా తప్పుకోనుందని సమాచారం. ఆమెకు సినిమాల్లో బాగా ఆఫర్లు వస్తున్నందున టీవీ షోలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నదట.
అయితే జబర్దస్త్ వేదికపై లవ్ ట్రాక్ కొనసాగిస్తున్న పెయిర్ ఏదైనా ఉంది అంటే.. అది సుధీర్, రష్మిల జోడీనే అని చెప్పవచ్చు. వీరి జోడీకి ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతుంటారు. అంతలా వీరి లవ్ ట్రాక్ ఫేమస్ అయింది. వీరిద్దరూ కలసి స్కిట్ చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. ఎన్నోసార్లు ఇలా ఈ జంట జబర్దస్త్ స్టేజిపై సందడి చేసింది. అయితే ఇప్పుడు సుధీర్ లేడు కనుక ఈ హిట్ పెయిర్ను మళ్లీ ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. కానీ ఇతర చానల్స్లోనూ వీరు తమ ట్రాక్ను కొనసాగిస్తున్నారు.
అయితే సుధీర్, రష్మిలు ఇలా జోడీగా కొనసాగుతుండడంతో వీరి మధ్య ఏదో ఉందని గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. ఇప్పటికీ అవి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వీరు అనేక సార్లు తమ మధ్య ఏమీ లేదని.. షో కోసమే అలా చేస్తున్నామని చెప్పేశారు. కానీ ఎవరూ నమ్మలేదు. ఇక ఇదే విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ కూడా తెలియజేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జబర్దస్త్ షోతోపాటు సుధీర్, రష్మిల గురించి పలు కీలక విషయాలను వెల్లడించాడు.
జబర్దస్త్లో అందరూ అకున్నట్లుగా రష్మి, సుధీర్ల మధ్య ఏదీ లేదని.. అదంతా వారు కేవలం షోకు రేటింగ్స్ కోసమే చేశారని తెలిపాడు. అలాగే ఈ షోకు సుధీర్ వల్లే బాగా పేరు వచ్చిందని అన్నాడు. అయితే ఈ షోలో నిర్వాహకులు తమకు ఎక్కువ మర్యాద ఇవ్వడం లేదని.. కనీసం భోజనాలు కూడా పెట్టరని అన్నాడు. కేవలం నాగబాబు మాత్రమే తమపై ప్రేమ చూపిస్తారని.. ఆయన గతంలో ఓ కంటెస్టెంట్కు ఆపరేషన్ కోసం సహాయం చేశారని తెలిపాడు. కాగా జబర్దస్త్ షోపై ఆర్పీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…