Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సమాజంలో జరిగే సంఘటనలపై పెద్దగా స్పందించడం లేదు. మొన్నీ మధ్య మెగా డాటర్ నిహారిక డ్రగ్స్ కేసులో ఈమె కలగజేసుకుని నాగబాబును చెడామడా తిట్టేసింది. నాగబాబు నీతులు చెప్పడం కాదు.. కూతురిని ఎలా పెంచాలో ముందుగా తెలుసుకో.. అంటూ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఆ తరువాత ఏ విషయంపై కూడా స్పందించలేదు. ఇక తాజాగా సీఎం వైఎస్ జగన్కు చెందిన ఓ పాత ఫొటోను షేర్ చేసిన ఆమె.. ఇంకా మీతోనే ఉన్నా అన్నా.. అంటూ కాప్షన్ పెట్టింది. దీంతో ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే శ్రీరెడ్డి తాజాగా కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవలోకి ఎంటర్ అయింది. ఇక ఆమె తన మద్దతును ఎవరికి తెలియజేసింది ? అంటే..
తరచూ వివాదాల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల గొడవలోకి ఎంటర్ అయింది. తన సపోర్ట్ ఎవరికో చెప్పేసింది. తాజాగా ఆమె ఫేస్బుక్ లైవ్ ద్వారా ఫ్యాన్స్తో ముచ్చటించింది. అందులో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇక కల్యాణి గొడవపై మాట్లాడుతూ.. మా ఎస్సార్ నగర్ పోలీస్ జోలికొస్తే తోలు తీస్తా కల్యాణి, శ్రీకాంత్ రెడ్డికే నా సపోర్ట్.. అంటూ చెప్పేసింది. ఈ క్రమంలోనే దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
కాగా కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల గొడవలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా.. కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. కల్యాణి చిన్న పిల్లలను కొని అమ్ముతుందన్న ఆరోపణలపై వారు సోదాలు చేపట్టారు. ఆమె దగ్గర ఉన్న బిడ్డను ఆమె నిజంగానే దత్తత తీసుకుందా.. తీసుకుంటే అందుకు సంబంధించిన పత్రాలు ఏవి ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక కల్యాణి గత 24 గంటల నుంచి కనిపించడం లేదని.. ఆమె ఫోన్కు కాల్ చేస్తే స్విచాఫ్ వస్తుందని ఆమె తల్లి విజయలక్ష్మి చెబుతున్నారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తన కుమార్తెను ఏదో చేసి ఉంటాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తూ తన సపోర్ట్ను శ్రీకాంత్ రెడ్డికి తెలియజేయడం.. సంచలనంగా మారింది. మరి ఈ ఇద్దరి గొడవలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…