Devi Nagavalli : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది.. యాంకర్ దేవీ నాగవల్లి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఆమె విశ్వక్సేన్తో వివాదంలో చిక్కుకుంది. ఓ నటున్ని స్టూడియోకు పిలిచి మరీ అవమానించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు అందరూ విశ్వక్కే తమ సపోర్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ గొడవ కాస్త సద్దుమణిగింది. అయినప్పటికీ దేవి నాగవల్లికి మాత్రం విమర్శలు, కౌంటర్లు, ట్రోల్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా తనది కాని గొడవలోనూ ఆమె చిక్కకుంది. దీంతో మరోమారు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయంతో దూసుకుపోతోంది. ఈ మూవీ 3 రోజుల్లోనే రూ.112 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అయితే సినిమా హిట్ అవడంతో మహేష్ ఫ్యాన్స్ సంబురాలు జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడని అంటున్నారు. అయితే ఓ చానల్ మాత్రం సర్కారు వారి పాటపై నెగెటివ్ కామెంట్స్ చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆ చానల్ను బండ బూతులు తిడుతున్నారు.
మహేష్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఆ చానల్ను తిట్టిపోస్తున్నారు. ట్విట్టర్ వేదికగా చెప్పలేని ఓ బూతుతో కూడిన హ్యాష్ ట్యాగ్ను కూడా రన్ చేస్తున్నారు. అయితే సదరు చానల్ వారు సర్కారు వారి పాట గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నా సరే.. వారు మహేష్కు క్షమాపణలు చెప్పాల్సిందేనని అంటున్నారు. అయితే ఈ గొడవలోకి సదరు చానల్ యాంకర్ దేవి నాగవల్లిని కూడా లాగారు. ఆమెకు చెందిన పాత ఫొటోలను మార్ఫింగ్ చేసి మహేష్ ఫ్యాన్స్ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పనిలో పనిగా ఆ చానల్తోపాటు ఆమెను కూడా తిడుతూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే అసలు దీనికి, ఆమెకు సంబంధం లేదు. కానీ ఇటీవల ఆమె చిక్కకున్న వివాదం కారణంగా.. ఆమె ఆ చానల్లోనే పనిచేస్తున్న కారణంగా.. ఆమెను కూడా మహేష్ ఫ్యాన్స్ ఈ వివాదంలోకి లాగారు. దీంతో ఆమెను కూడా మళ్లీ ట్రోల్ చేస్తూ.. విమర్శిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…