Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా టాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటి.. శ్రీరెడ్డి. ఆ తరువాత ఈమె పెద్దగా సందడి చేయలేదు. ఆమె అప్పట్లో పవన్పై చేసిన కామెంట్ల వల్ల టాలీవుడ్కు శాశ్వతంగా దూరమైంది. అంతేకాదు.. హైదరాబాద్లో ఉంటే తనకు ముప్పు ఉంటుందని భావించిన ఈమె చెన్నైకి మకాం మార్చింది. అప్పటి నుంచి అక్కడే ఉంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్కు టచ్లో ఉంటూ వస్తోంది శ్రీరెడ్డి. అయితే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి యూట్యూబ్లో అనేక వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.
ఇప్పటికే శ్రీరెడ్డి చికెన్, మటన్, రొయ్యలు, పీతలు.. వంటి ఎన్నో వెరైటీ వంటకాలను చేసింది. ఆ వంటకాలను వండేటప్పుడు ఈమె తనదైన శైలిలో పంచులు వేస్తుంటుంది. అలాగే సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తుంటుంది. ఇక గతంలో నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు శ్రీరెడ్డి వారిపై ఘాటు విమర్శలు చేసింది. ఆ తరువాత విషయాలపై ఈమె పెద్దగా స్పందించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీరెడ్డి యాక్టివ్గానే ఉంటోంది.
కాగా శ్రీరెడ్డి లేటెస్ట్గా పులస చేపల కూర వండింది. తాను కిలో రూ.10వేలు పెట్టి చేపలను కొన్నానని తెలియజేసింది. అంతేకాదు.. చేపలను ఎలా వండాలో కూడా చెప్పింది. పులస చేపలను వండే శైలి గురించి వివరించింది. ఇక శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయడం లేదు.. కానీ తమిళ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది. తనకు తమిళ్ బాగా తెలుసు. అందువల్లే ఆమె చెన్నైలో సెటిల్ అయింది. ఇక శ్రీరెడ్డి లేటెస్ట్గా షేర్ చేసిన పులస చేపల కూర వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…