Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా టాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటి.. శ్రీరెడ్డి. ఆ తరువాత ఈమె పెద్దగా సందడి చేయలేదు. ఆమె అప్పట్లో పవన్పై చేసిన కామెంట్ల వల్ల టాలీవుడ్కు శాశ్వతంగా దూరమైంది. అంతేకాదు.. హైదరాబాద్లో ఉంటే తనకు ముప్పు ఉంటుందని భావించిన ఈమె చెన్నైకి మకాం మార్చింది. అప్పటి నుంచి అక్కడే ఉంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్కు టచ్లో ఉంటూ వస్తోంది శ్రీరెడ్డి. అయితే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి యూట్యూబ్లో అనేక వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.
ఇప్పటికే శ్రీరెడ్డి చికెన్, మటన్, రొయ్యలు, పీతలు.. వంటి ఎన్నో వెరైటీ వంటకాలను చేసింది. ఆ వంటకాలను వండేటప్పుడు ఈమె తనదైన శైలిలో పంచులు వేస్తుంటుంది. అలాగే సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తుంటుంది. ఇక గతంలో నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు శ్రీరెడ్డి వారిపై ఘాటు విమర్శలు చేసింది. ఆ తరువాత విషయాలపై ఈమె పెద్దగా స్పందించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీరెడ్డి యాక్టివ్గానే ఉంటోంది.
కాగా శ్రీరెడ్డి లేటెస్ట్గా పులస చేపల కూర వండింది. తాను కిలో రూ.10వేలు పెట్టి చేపలను కొన్నానని తెలియజేసింది. అంతేకాదు.. చేపలను ఎలా వండాలో కూడా చెప్పింది. పులస చేపలను వండే శైలి గురించి వివరించింది. ఇక శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయడం లేదు.. కానీ తమిళ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది. తనకు తమిళ్ బాగా తెలుసు. అందువల్లే ఆమె చెన్నైలో సెటిల్ అయింది. ఇక శ్రీరెడ్డి లేటెస్ట్గా షేర్ చేసిన పులస చేపల కూర వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…