Sri Reddy : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమోగానీ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు అక్టోబర్ 16న తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటూ.. ఇండస్ట్రీ పెద్దలను కలుస్తుండగా.. మరోవైపు ప్రకాష్ రాజ్ మాత్రం ఎన్నికల రోజు జరిగిన ఘటనలను బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే మా ఎన్నికల వివాదంపై నటి శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాను మా కార్యాలయం ఎదుట ఆందోళన చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదని వాపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అందరూ తమకు అన్యాయం జరిగిందని రోడ్డు పైకి వచ్చి గుక్క పెట్టి ఏడుస్తున్నారని విమర్శించింది.
మా అసోసియేషన్కు సేవ చేస్తామని ప్రకాష్ రాజ్ అంటున్నారు.. ఎవరు సేవ చేస్తే ఏమిటి ? మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ ఏడుపు ఎందుకు ? అని ప్రశ్నించింది. ఇక చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులు వేసిన ఎత్తులు పారలేదని, వారు ఏళ్ల తరబడి కొనసాగించిన ఆధిపత్యం పోయినందుకే.. ఈ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించింది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పరువు తీశానని గతంలో హేమ, జీవిత, నాగబాబు సహా కొందరు వ్యక్తులు తనను ఏడిపించారని, కానీ ఇప్పుడు వారే అసోసియేషన్ పరువును గంగపాలు చేస్తున్నారని విమర్శించింది.
అసోసియేషన్లో కమ్మ, కాపు ఫీలింగ్ వచ్చిందని, దాసరి తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేయగల సమర్థత కేవలం మోహన్ బాబుకే ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…