Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు ఇరు ప్యానెల్స్ కు చెందిన సభ్యులు.. అందరం ఒకటే అన్నారు. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. స్పోర్టివ్గా తీసుకుంటామని.. అందరమూ కలసి పనిచేస్తామని చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ఆ మాటలను పక్కన పెట్టేశారు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలను నూరుతున్నారు.
ముఖ్యంగా ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టాక.. నరేష్ వారిని ఉద్దేశించి ముండమోపి ఏడుపులు.. అని దారుణంగా కామెంట్లు చేశారు. దీంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో నటీనటుల భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి.
ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎక్కువ సినిమాలు తీస్తూ ఉంటుంది. అందువల్ల వారి మూవీల్లో చాలా మందికి అవకాశాలు వస్తుంటాయి. మోహన్ బాబు కుటుంబం కూడా సినిమాలు తీస్తుంటుంది. కానీ వారి మూవీలు చాలా తక్కువగా వస్తుంటాయి. అయితే ‘మా’ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంచు విష్ణు ప్యానెల్లో ఉన్న నటీనటులకు ఇకపై సినిమాల్లో అవకాశాలు ఇచ్చే అంశాన్ని ప్రస్తుతం మెగా ఫ్యామిలీ పరిశీలిస్తున్నదట.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తీవ్రంగా హర్ట్ అయిన చిరంజీవి, ఆయన సోదరులు, ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు.. మంచు విష్ణు ప్యానెల్ నటీనటులను బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశాలు లేకపోలేదు.. అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే విష్ణు ప్యానెల్లో పోటీ చేసిన వారితోపాటు వారికి మద్దతుగా నిలిచిన నటులకు కూడా ఇకపై మెగా ఫ్యామిలీ సినిమాల్లో అవకాశాలు పూర్తిగా ఉండకపోవచ్చని అంటున్నారు.
అయితే ముందు ముందు ఇరు ప్యానెల్స్ మధ్య రాజీ కుదిరి అందరూ ‘మా’ బాగు కోసం, నటీనటుల సంక్షేమం కోసం పనిచేస్తే.. ఎప్పటిలా అందరికీ అవకాశాలు వస్తాయి. కానీ ఈ వివాదం ఇంతటితో ఆగకుండా.. ఒకరిపై ఒకరు ఇలాగే దూషణలు, ఆరోపణలు చేస్తూ వెళితే.. పైన చెప్పినట్లుగా మెగా ఫ్యామిలీ సినిమాల్లో మంచు ప్యానెల్ సభ్యులకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం ఖాయం అవుతుంది. మరి ఈ వివాదం ముగుస్తుందా.. లేదా.. అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…