Sri Reddy : సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్య ఈమె సామాజిక అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. తన పనేదో తాను చేసుకుపోతోంది. చివరిసారిగా ఈమె నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయమై తెర మీదకు వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఏ ఇష్యూపై కూడా స్పందించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తూనే ఉంది. తన సొంత పనులతో బిజీగా మారింది. ఇక ఈమె ప్రస్తుతం చెన్నైలో ఉంటూ.. అక్కడి నుంచే తన కార్యకలాపాలను చక్కబెడుతోంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానల్లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ ఎంతో బిజీగా మారింది.
శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చానల్లో వంటల వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు వంటలు మాని రెస్టారెంట్లకు తిరుగుతూ అక్కడ ఉండే ఫుడ్ను టేస్ట్ చేసి వాటికి రివ్యూలు ఇస్తోంది. ఇటీవలే ఓ రెస్టారెంట్లో సందడి చేసిన ఈమె అక్కడి ఫుడ్కు 10కి కేవలం 6 మార్కులే ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ ఇంకో రెస్టారెంట్కు వెళ్లి అన్ని నాన్వెజ్, వెజ్ వంటకాలను రుచి చూసింది. అక్కడ కొన్ని వంటకాలకు ఈమె 10కి 10 మార్కులు ఇవ్వగా.. కొన్నింటికి మాత్రం 6 మార్కులనే ఇచ్చింది.
ఇక శ్రీరెడ్డి ఈ మధ్య వంటల వీడియోలతోనే ఎంతో బిజీగా ఉంటోంది. సమాజంలో అనేక సంచలన సంఘటనలు జరుగుతున్నా వాటిని ఈ అమ్మడు పట్టించుకోవడం లేదు. అప్పట్లో ఈమె కాస్టింగ్ కౌచ్ ద్వారా ఎంతో పాపులర్ అయింది. ఈమె ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేయడం సంచలనంగా మారింది. తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూచన మేరకు పవన్ను తిట్టింది. ఆ తరువాత పవన్ అభిమానుల సెగకు కొంతకాలం అందరికీ కనిపించకుండా జీవించింది. ఆ తరువాత మళ్లీ యథావిధిగా తన పనులను చేయడం ప్రారంభించింది. అయితే ఈమె సామాజిక అంశాలపై ఎందుకు స్పందించడం లేదు.. అని కొందరు సందేహిస్తున్నారు. మరి శ్రీరెడ్డి దీనిపై ఆలోచిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…