Sri Reddy : సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్య ఈమె సామాజిక అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. తన పనేదో తాను చేసుకుపోతోంది. చివరిసారిగా ఈమె నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయమై తెర మీదకు వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఏ ఇష్యూపై కూడా స్పందించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తూనే ఉంది. తన సొంత పనులతో బిజీగా మారింది. ఇక ఈమె ప్రస్తుతం చెన్నైలో ఉంటూ.. అక్కడి నుంచే తన కార్యకలాపాలను చక్కబెడుతోంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానల్లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ ఎంతో బిజీగా మారింది.
శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చానల్లో వంటల వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు వంటలు మాని రెస్టారెంట్లకు తిరుగుతూ అక్కడ ఉండే ఫుడ్ను టేస్ట్ చేసి వాటికి రివ్యూలు ఇస్తోంది. ఇటీవలే ఓ రెస్టారెంట్లో సందడి చేసిన ఈమె అక్కడి ఫుడ్కు 10కి కేవలం 6 మార్కులే ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ ఇంకో రెస్టారెంట్కు వెళ్లి అన్ని నాన్వెజ్, వెజ్ వంటకాలను రుచి చూసింది. అక్కడ కొన్ని వంటకాలకు ఈమె 10కి 10 మార్కులు ఇవ్వగా.. కొన్నింటికి మాత్రం 6 మార్కులనే ఇచ్చింది.
ఇక శ్రీరెడ్డి ఈ మధ్య వంటల వీడియోలతోనే ఎంతో బిజీగా ఉంటోంది. సమాజంలో అనేక సంచలన సంఘటనలు జరుగుతున్నా వాటిని ఈ అమ్మడు పట్టించుకోవడం లేదు. అప్పట్లో ఈమె కాస్టింగ్ కౌచ్ ద్వారా ఎంతో పాపులర్ అయింది. ఈమె ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేయడం సంచలనంగా మారింది. తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూచన మేరకు పవన్ను తిట్టింది. ఆ తరువాత పవన్ అభిమానుల సెగకు కొంతకాలం అందరికీ కనిపించకుండా జీవించింది. ఆ తరువాత మళ్లీ యథావిధిగా తన పనులను చేయడం ప్రారంభించింది. అయితే ఈమె సామాజిక అంశాలపై ఎందుకు స్పందించడం లేదు.. అని కొందరు సందేహిస్తున్నారు. మరి శ్రీరెడ్డి దీనిపై ఆలోచిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…