Sri Reddy : శ్రీరెడ్డి నటిగా కంటే వివాదాల వల్లే ఎక్కువ ఫేమస్ అయిన విషయం విదితమే. ఈమె ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అవి వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది. ప్రస్తుతం తన యూట్యూబ్ చానల్లో పలు వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ కాలం గడుపుతోంది. ఇక ఇటీవలే మెగా డాటర్ నిహారిక డ్రగ్స్ కేసు విషయంలో శ్రీరెడ్డి.. నాగబాబును కడిగి పారేసింది. నాగబాబు తెల్లారి లేస్తే నీతులు చెబుతారని.. కానీ సొంత కుమార్తెను సరిగ్గా పెంచలేదని ఫైర్ అయింది. ఇక శ్రీరెడ్డి సమాజంలో జరిగే సంఘటనలపై కూడా స్పందిస్తుంటుంది.
పవన్ కల్యాణ్ అంటే అంత ఎత్తున లేచి పడే శ్రీరెడ్డి రాజకీయాల పరంగా సీఎం జగన్ను అభిమానిస్తుంది. గతంలోనే ఈ విషయం గురించి ఆమె పలు మార్లు చెప్పింది. తనకు వైఎస్సార్ అంటే ఇష్టమని.. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ అంటే ఇంకా ఇష్టమని శ్రీరెడ్డి తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనధికారికంగా మద్దతు ఇస్తుంటుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులకు తన సపోర్ట్ తెలుపుతుంటుంది. మరోవైపు వైసీపీని టార్గెట్ చేసే వారిపై కామెంట్లు కూడా చేస్తుంటుంది. అయితే శ్రీరెడ్డి తాజాగా సీఎం జగన్కు చెందిన ఓ పాత ఫొటోను షేర్ చేసింది.
శ్రీరెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో సీఎం వైఎస్ జగన్కు చెందిన ఒక పాత ఫొటోను షేర్ చేసింది. దానికి కాప్షన్ కూడా పెట్టింది. స్టిల్ విత్ యు అన్నా.. అంటే.. ఇప్పటికీ మీతోనే ఉన్నా అన్నా.. అని కాప్షన్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్గా మారింది.
అయితే శ్రీరెడ్డి వైకాపాకు మద్దతుగానే ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే.. కానీ ఆమె ఇంత సడెన్గా ఎందుకు ఆ పోస్ట్ పెట్టింది.. అన్నది మాత్రం తెలియడం లేదు. ఇక శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వైఎస్సార్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…