Sreeja Konidela : ఇటీవల చాలా మంది కపుల్స్ చిన్న చిన్న కారణాలతో మంచి లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. నాగ చైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి గత ఏడాది బ్రేకప్ చెప్పగా, ఇప్పుడు శ్రీజ-కళ్యాణ్ దేవ్ రిలేషన్పై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా శ్రీజ- కళ్యాణ్ దేవ్ ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి కళ్యాణ్ దేవ్ను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజ కళ్యాణ్గా మార్చుకుంది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయని, గత ఏడాది జూలై, ఆగస్టులోనే వారు విడిపోయారని వార్తలు వచ్చాయి.
వీరిపై అలా ప్రచారం జరగడం వెనుక కూడా కారణాలు లేకపోలేదు. శ్రీజ.. కళ్యాణ్ దేవ్ పేరుని తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించడమే కాదు.. శ్రీజ కొణిదెలగా మార్చుకుంది. ఇన్ స్టాలో కళ్యాణ్ దేవ్ అకౌంట్ను అన్ ఫాలో కూడా చేసింది. ఇలా చేయడం ద్వారా.. కళ్యాణ్ దేవ్తో విడిపోయినట్లు ఆమె తన సైడ్ నుంచి పూర్తి క్లారిటీ ఇచ్చేసిందనే వార్తలు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాక కళ్యాణ్ దేవ్ ఇటీవల మెగా వేడుకలలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
తాజాగా శ్రీజ వెకేషన్ ట్రిప్ వేయగా.. ఆ సమయంలో కళ్యాణ్ దేవ్ లేకపోవడం అభిమానులలో అనేక ఆలోచనలను రేకెత్తిస్తోంది. తాజాగా తన పిల్లలతో కలిసి తమిళనాడులోని కోటగిరి హిల్స్కు వెళ్లి సేద తీరుతోంది శ్రీజ. ఇందుకు సంబంధించిన ఫోటోలను నవిష్క ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ వెకేషన్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇవి చూసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడా కళ్యాణ్ మిస్ అయ్యాడా, ఏం జరుగుతోంది.. అసలు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరి విడాకుల విషయమై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందేమో చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…