Ameesha Patel : తెలుగు, హిందీ చిత్రాల్లో తనదైన నటనా శైలితో అలరించిన అమీషా పటేల్ అశేష ప్రేక్షకాదరణ సంపాదించింది. మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన అమీషా పటేల్ తన తండ్రి స్నేహితుడు రాకేష్ రోషన్ సహకారంతో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టింది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని స్టార్ హీరోయిన్గా మారింది అమీషా పటేల్. బద్రి, నాని సినిమాలతో తెలుగువారికి పరిచయమైంది ఈ హీరోయిన్. కహోనా ప్యార్ హై చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలోనూ నటించి అలరించింది. ఇప్పటికీ ఈ అమ్మడు తన నటనతోపాటు అందాలతో ఆకర్షిస్తోంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి లో పవన్ కళ్యాణ్ కు జంటగా నటించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు, ప్రధానంగా యూత్ కు ఎంతగా నచ్చిందో తెలిసిన విషయమే. బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ మూవీల్లో నటించి మెప్పింది. వాటిలో గదర్ : ఎక్ ప్రేమ్ కథ, హమ్రాజ్, సునో ససుర్జీ, మంగళ్ పాండే, హమ్ కో తుమ్సే ప్యార్ హై, రేస్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గదర్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న అమీషా ఢిల్లీలో ఎంజాయ్ చేస్తోంది. ఓ చెట్టు కింద బికినీ ధరించి నిల్చున్న ఆమె ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
అయితే ఆమె ఓ వైపు అలా అందాల ఆరబోతతో రచ్చ చేస్తుండగా.. ఆమె మీద చీటింగ్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం నిర్వాహకులు అమీషా పటేల్ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్లో పాల్గొనేందుకు ఆమె రూ.4 లక్షలు వసూలు చేసింది. తీరా ప్రోగ్రామ్కు వచ్చిన తర్వాత కేవలం మూడు నిమిషాలే స్టేజీపై కనిపించి జంప్ అయింది. ఈ క్రమంలో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అమీషా ట్విటర్ వేదికగా స్పందించింది. ఏప్రిల్ 23వ తేదీన మధ్యప్రదేశ్లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు హాజరయ్యాను. స్టార్ ఫ్లాష్ ఎంటర్టైన్మెంట్, అరవింద్ పాండే కార్యక్రమాన్ని సరిగా నిర్వహించలేదు. నాకు ప్రాణ భయం పట్టుకుంది. స్థానిక పోలీసుల సహాయంతో భయటపడ్డాను అని అమీషా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే తీసుకున్న డబ్బును వెనక్కి ఇస్తానని మాత్రం చెప్పలేదు. అందువల్లే ఆమెపై చీటింగ్ కేసు పెట్టారని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…