Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్గా మారుతోంది. ఈ అమ్మడు సినిమాలు, పర్సనల్ విషయాలు, సోషల్ మీడియా పోస్ట్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సమంత కొద్ది రోజుల క్రితం శాకుంతలం అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. మహాభారతంలోని ఆదిపర్వం స్పూర్తిగా.. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతోంది. మైథలాజికల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో సామ్ శకుంతలగా కనిపించనుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత రాజుగా నటిస్తున్నాడు. కబీర్ సింగ్ దుహన్ రాజు అసుర పాత్ర పోషిస్తున్నాడు.
గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా కోసం సామ్ ప్రత్యేకించి బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకుంది. శకుంతల పాత్ర కోసం మూడు నెలలు శిక్షణ తీసుకున్నట్టు చెప్పింది సామ్. పురాణాల కాలం నాటి సాధారణ భంగిమలు, మనోహరమైన నడక, పౌరాణిక పాత్రలతో అనుసంధానంగా ఉండే సంజ్ఞలు, ఇతర అంశాలపై సామ్ శిక్షణ తీసుకుందట. అయితే ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కొన్నాళ్లుగా ఒక్క అప్డేట్ లేదు. కనీసం సమంత ఈ సినిమా చేసిందని కొంత మందికి తెలియదు కూడా.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే సినిమా కోసం ఆమె పడిన కష్టం, త్యాగం అన్ని వృథా అయినట్టేనని అభిమానులు చాలా బాధపడుతున్నారు. సమంత ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా వేస్ట్ అయినట్టేనా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. శాకుంతలం సినిమా స్పూర్తితో సమంత రానున్న రోజులలో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్లు చేయాలని అనుకుందని, కానీ ఈ సినిమా నీరు గార్చిందని కామెంట్స్ చేస్తున్నారు. శాకుంతలం సినిమాని 2022 చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువరాజు భరత పాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్హ కనిపించనుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…