Sonu Sood : కరోనా మొదటి వేవ్ సమయం నుంచి నటుడు సోనూసూద్ ఎంత మంది ఆదుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఆదుకోండి.. అంటూ తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయన నేనున్నానంటూ సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోనూసూద్ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సొంత ఊళ్లో బాలికలు, మహిళలు, యువతులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
పంజాబ్లోని మోగాలో ఉన్న దౌలత్పురా నీవన్ అనే గ్రామంలో సోనూసూద్ సోదరి మాళవిక విద్యార్థినులు, ఆశ వర్కర్లకు 1000 సైకిళ్లను పంపిణీ చేశారు. ఆమె ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో చేరేది వెల్లడించలేదు. అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలను మాత్రం చేపడుతున్నారు. ఇక ఆమెకు మద్దతుగా సోనూసూద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోనూసూద్ తన సోదరి మాళవికతో కలిసి ఇప్పటికే సూద్ చారిటీ ఫౌండేషన్ సేరిట స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మోగే ది ఢీ పేరిట విద్యార్థినిలు, ఆశ వర్కర్లకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.
అయితే పంజాబ్లో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం వేడెక్కింది. ఇప్పటికే అనేక పార్టీలు తాము ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాయో చెప్పేశాయి. సుఖ్బీర్ సింగ్ బాదల్ తాము అధికారంలోకి వస్తే ఒక్కో మహిళకు నెలకు రూ.2000 ఇస్తామని చెప్పగా.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ఒక్కొక్కరికి రూ.1000 ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు మహిళలకు నెల నెలా ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను, ఒక్కొక్కరికి రూ.2000తోపాటు గృహిణులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను, 5 నుంచి 12 తరగతులు చదువుతున్న బాలికలకు నెలకు రూ.5వేల నుంచి రూ.20వేలు ఇస్తామని చెప్పారు. అలాగే ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినిలకు ఉచితంగా లోన్లు కూడా ఇస్తామని తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…