RRR Movie : ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఆలియా భట్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీలో నటించారు. అందరి అంచనాల నడుమ జనవరి 7వ తేదీన ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ మూవీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే రూ.40 కోట్ల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే విడుదల వాయిదా పడడంతో ప్రమోషన్స్ కోసం పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరులా మారిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని తాజాగా ఓ వివాదం చుట్టు ముట్టింది. ఈ మూవీ విడుదలను ఆపేయాలని కోరుతూ ఓ యువతి కోర్టుకెక్కింది.
ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్గా, రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. మొదట్నుంచీ మూవీ కల్పితమనే రాజమౌళి చెబుతూ వచ్చారు. అయితే ఈ మూవీపై తెలంగాణ హైకోర్టులో అల్లూరి సౌమ్య అనే యువతి పిల్ వేసింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య కోర్టులో పిల్ దాఖలు చేసింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. అయితే చారిత్రక యోధుల పాత్రలను రాజమౌళి వక్రీకరించి చిత్రీకరించారని, మహనీయుల అసలు చరిత్ర కాకుండా కాల్పనిక కథతో సినిమా తెరకెక్కించడంపై అభ్యంతరాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇప్పటికే జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయడంతోపాటు సినిమా విడుదలను నిలిపివేయాలని అల్లూరి వంశానికి చెందిన సౌమ్య పిల్ దాఖలు చేసింది.
కొమరం భీమ్, అల్లూరి వంటి యోధుల జీవితాలకు వ్యతిరేకంగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారని ఆమె ఆరోపణలు చేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ అధికారిగా పనిచేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఈ పిటిషన్లో ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, డైరెక్టర్ రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్ లను చేర్చారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాపై వేసిన పిల్కు గాను హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…