Nagarjuna : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ కావడంతో ఈ విషయంలో హీట్ మరింత పెరిగింది. దీంతో ఆయనకు, ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. అయితే ఎట్టకేలకు వర్మ ఈ తగవుకు ఇక ఫుల్ స్టాప్ పెడుతున్నానని.. ఇలా మాటల యుద్ధం కొనసాగిస్తే ఒరిగేది ఏమీ ఉండదని.. కనుక ఇకపై తాను ఈ గొడవపై మాట్లాడబోనని తెలిపారు.
అయితే తాజాగా బంగార్రాజు మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అక్కినేని నాగార్జునకు ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై స్పందించాలని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆయన స్పందించారు. టిక్కెట్ల రేట్లు ఎలా ఉన్నా తన సినిమాకు వచ్చే నష్టం ఏమీ ఉండదని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశంపై ఇంతకన్నా మించి మాట్లాడడం సరికాదన్నారు.
కాగా సినిమా టిక్కెట్ల రేట్లపై ఫిబ్రవరి 10 లోపు సంపూర్ణ నివేదిక ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్ర వివరాలను సేకరిస్తోంది. పూర్తి నివేదికను త్వరలోనే కోర్టుకు సమర్పించనుంది. ఈ క్రమంలో కోర్టు తుది తీర్పు ఏమని ఇస్తుందా..? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…