Simran : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరంలేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో తన నటనకు గాను చెరగని ముద్ర వేసుకుంది. ఇక అప్పట్లో సిమ్రాన్ కు ఒక రేంజ్ లో ప్రేక్షకులలో ఫాలోయింగ్ ఉండేది. అబ్బాయిగారి పెళ్లి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సిమ్రాన్ మా నాన్నకు పెళ్లి చిత్రంలో శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా నటించి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మొత్తానికి సిమ్రాన్ నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిందనే చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ సిమ్రాన్ క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి అద్భుతమైన సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.
ఆ తరువాత సిమ్రాన్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడు ఊహించిన స్థాయిలో గుర్తింపు అందుకోలేకపోయింది. బాలీవుడ్ లో నటించిన సిమ్రాన్ కి ఒక సక్సెస్ కూడా దక్కలేదు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిమ్రాన్ హీరో రజనీకాంత్ సరసన పేట చిత్రంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాధవన్ హీరోగా నటించిన రాకెట్రీ చిత్రంలో కూడా సిమ్రాన్ నటించారు.
తాజాగా సిమ్రాన్ తన ట్విట్టర్ ద్వారా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసుకుంది. సిమ్రాన్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 46 ఏళ్ల వయసులో కూడా సిమ్రాన్ ఎంతో గ్లామర్ లుక్ తో నేటి తరం యువ హీరోయిన్ లను తలదన్నే అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. 45 ప్లస్ లో కూడా సిమ్రాన్ ఇంకా 25 ఏళ్ళ అమ్మాయిలా కనిపించడానికి గల అసలు కారణం ఏమిటి అనే విషయంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సిమ్రాన్ తమిళ్ మరియు హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…