Shruti Haasan : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటిల్లో సెలబ్రిటీలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక తాజాగా శృతి హాసన్కు చెందిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది. శృతి హాసన్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని.. ఆమె హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతుందని.. వార్తలు వచ్చాయి. అయితే వాటిపై శృతి హాసన్ స్పందించింది. ఒక వీడియో మెసేజ్ ద్వారా ఆ వార్తలను ఖండించింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని శృతి హాసన్ కొట్టి పారేసింది. అవన్నీ పుకార్లేనని వాటిని నమ్మవద్దని చెప్పింది. తనకు ఏమీ కాలేదని.. నిక్షేపంగా ఉన్నానని.. కండిషన్ సీరియస్ అని.. ఐసీయూలో ఉన్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆమె కోరింది. కొందరు కావాలనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తనకు పీసీవోఎస్ సమస్య చాలా కాలంగా ఉందని.. అంతేకానీ తన ఆరోగ్యం మాత్రం క్షీణించలేదని.. మరోమారు స్పష్టం చేసింది.
ఇక శృతి హాసన్ ఈమధ్యే కరోనా బారిన పడింది. ఆ తరువాత కోలుకుంది. కానీ కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ఈమె షాకింగ్ లుక్లో కనిపించింది. దీంతో ఈమె ఆరోగ్యం నిజంగానే క్షీణించిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఆమెనే స్వయంగా చెప్పేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్లో నటిస్తుండగా.. మరోవైపు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలయ్య సినిమాలోనూ ఈమె నటిస్తోంది. దీంతోపాటు చిరంజీవి సినిమాలోనూ ఈమె కన్ఫామ్ అయింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…