Shruti Haasan : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటిల్లో సెలబ్రిటీలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక తాజాగా శృతి హాసన్కు చెందిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది. శృతి హాసన్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని.. ఆమె హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతుందని.. వార్తలు వచ్చాయి. అయితే వాటిపై శృతి హాసన్ స్పందించింది. ఒక వీడియో మెసేజ్ ద్వారా ఆ వార్తలను ఖండించింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని శృతి హాసన్ కొట్టి పారేసింది. అవన్నీ పుకార్లేనని వాటిని నమ్మవద్దని చెప్పింది. తనకు ఏమీ కాలేదని.. నిక్షేపంగా ఉన్నానని.. కండిషన్ సీరియస్ అని.. ఐసీయూలో ఉన్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆమె కోరింది. కొందరు కావాలనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తనకు పీసీవోఎస్ సమస్య చాలా కాలంగా ఉందని.. అంతేకానీ తన ఆరోగ్యం మాత్రం క్షీణించలేదని.. మరోమారు స్పష్టం చేసింది.
ఇక శృతి హాసన్ ఈమధ్యే కరోనా బారిన పడింది. ఆ తరువాత కోలుకుంది. కానీ కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ఈమె షాకింగ్ లుక్లో కనిపించింది. దీంతో ఈమె ఆరోగ్యం నిజంగానే క్షీణించిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఆమెనే స్వయంగా చెప్పేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్లో నటిస్తుండగా.. మరోవైపు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలయ్య సినిమాలోనూ ఈమె నటిస్తోంది. దీంతోపాటు చిరంజీవి సినిమాలోనూ ఈమె కన్ఫామ్ అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…