Shani Graha : ప్రతి మనిషి జాతకం తొమ్మిది గ్రహాల్లోని ఏవైనా గ్రహాల సంచారం మీద ఆధారపడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటే అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. లేదంటే అన్నీ కష్టాలే వస్తాయి. ఇక పుట్టినప్పుడు ఉండే గ్రహ స్థితిని బట్టి గ్రహ దోషాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే అలాంటి దోషాలకు శాంతి చేయిచాల్సి ఉంటుంది. దీంతో ఆ దోషం నుంచి బయట పడి శుభ ఫలితాలను పొందవచ్చు.
చాలా మందికి జీవితంలో శని దోషం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శనిదోషం రకరకాలుగా ఉంటుంది. అయితే శని చూపు సరిగ్గా లేకపోతే ఎవరికైనా సరే ఇబ్బందులు తప్పవు. అందుకని శని దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. శని సరిగ్గా చూడకపోతే అన్నీ కష్టాలే ఎదురవుతాయి.
శని దుష్ప్రభావం వల్ల తీవ్రమైన సమస్యలు ఏర్పడుతుంటాయి. చేసే ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతుంది. ఏ పనీ పూర్తికాదు. అలాగే ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు వస్తుంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఇవన్నీ శని సృష్టించే ఆటంకాలే అని చెప్పవచ్చు. ఇలాంటి వారు కింద చెప్పిన విధంగా చేస్తే శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. దీంతో శని చూపు సరిగ్గా ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అన్నీ శుభాలే కలుగుతాయి. మరి శనిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఏం చేయాల్సి ఉంటుందంటే..
మీ కుండలిలో శని దోషం లేదా శని బలహీనంగా ఉంటే ప్రతి శనివారం కొబ్బరికాయను గంగా, యమునా నది నీటిలో వదలాలి. లేదా సమీపంలో ఉన్న ఏదైనా నదిలోనూ కొబ్బరికాయను వదలవచ్చు. అలా కొబ్బరికాయను వదిలే సమయంలో ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా వరుసగా 7 శనివారాలు చేయాలి. దీంతో అన్ని సమస్యలు తొలగిపోతాయి. శనితో ఇబ్బందులు ఉండవు. పైగా శని అనుగ్రహం లభిస్తుంది. హనుమంతుడి ఆశీర్వాదం కూడా వెన్నంటే ఉంటుంది. ఎలాంటి సమస్యలు, కష్టాలు ఉండవు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…