Shah Rukh Khan : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారూఖ్ ఖాన్ ఒకరు. అతడిని ముద్దుగా బాలీవుడ్ బాద్ షా అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ వయస్సులోనూ షారూఖ్ ఖాన్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న షారూఖ్ ఖాన్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు.అయితే తాజాగా ఆయన ఇంటికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైలోని బాంద్రాలో షారూఖ్ ఖాన్కి పెద్ద భవంతి ఉన్న విషయం తెలిసిందే. తన అభిరుచికి తగినట్లుగా ఈ ఇల్లును మలుచుకున్నాడు. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది.
ఆ ఇంటికి మన్నత్ అనే పేరుని షారూఖ్ పెట్టుకోగా.. ఆయన బర్త్ డే నాడు అభిమానులు మన్నత్కి భారీగా తరలి వస్తుంటారు. ఆ సమయంలో మన్నత్ దీపపు కాంతులతో మెరిసిపోతుంటుంది. అయితే మన్నత్ నేమ్ ప్లేట్ను చాలా సార్లు మార్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్తో మన్నత్ నేమ్ ప్లేట్ను మార్చాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆ నేమ్ ప్లేట్ ఫొటోలు వైరల్గా మారాయి. అయితే ఈనేమ్ ప్లేట్ని షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేయగా, దీనికి రూ.25 లక్షల వరకు ఖర్చయిందట.
యూరప్ నుండి దిగుమతి చేసిన ప్రత్యేక రాయితో మన్నత్ నేమ్ ప్లేట్ని రూపొందించినట్టు తెలుస్తోంది. కొత్త డిజైన్ దగ్గర చాలా మంది పలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఇంటిలో 2001 నుంచి షారుఖ్ ఖాన్, అతని కుటుంబం నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమా చేస్తుండగా.. ఈ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…