Acharya Movie : దాదాపు మూడేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించగా.. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. పూజా హెగ్డె గ్లామర్ తోడు కావడంతో సినిమా మంచి హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూవీ తొలి షో నుండే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగా తగ్గాయి.
ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్లో విడుదలైంది. అంతేకాదు రూ.132.50 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలోకి దిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.29.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ.5.15 కోట్లు రాబడితే.. మూడో రోజు ఆదివారం.. రూ.4.07 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక నాలుగో రోజు.. ఈ సినిమాకు రూ. 53 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా రీచ్ కాదని అర్ధమవుతోంది. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఆచార్య మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ సినిమా విడుదలై నెల రోజులు కాకముందే ఆచార్య ఓటీటీలలో రానుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొణిదెల ఎంటర్టైన్మెంట్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. పూజా హెగ్డె, తనికెళ్ల భరణి, అజయ్, శత్రు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ ఆచార్యకు సంగీతం అందించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…