Sania Mirza : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తాజాగా టీ20 వరల్డ్ కప్లో తలపడిన విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్లో వార్ వన్ సైడే అన్నట్లుగా పాకిస్థాన్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్ను డామినేట్ చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న రికార్డును పాక్ తిరగరాసింది. ఐసీసీ టోర్నీల్లో భారత్పై తొలిసారిగా గెలుపొందింది.
అయితే ఈ మ్యాచ్లో పాక్ జట్టులో ఆడుతున్న షోయబ్ మాలిక్ ఆ జట్టులోనే అత్యంత సీనియర్ ఆటగాడిగా పేరుపొందాడు. పాక్ ఫీల్డింగ్ సమయంలో అతను బౌండరీ వద్ద నిలుచున్నాడు. అయితే అదే సమయంలో కొందరు భారత జట్టు ఫ్యాన్స్ అతన్ని ‘జిజాజీ’ (బావ) అని పిలిచారు. చప్పట్లు కొట్టారు. దీంతో మాలిక్ వెనక్కి తిరిగి తాను కూడా వాళ్లను ఉత్సాహ పరిచాడు. చేత్తో సైగలు చేశాడు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్గా మారింది.
కాగా ఆ వీడియోకు సానియా మీర్జా స్పందించింది. విపరీతమైన నవ్వు, ప్రేమతో కూడిన ఎమోజీలను కామెంట్గా పెట్టి ఆ వీడియోను రీట్వీట్ చేసింది. ఆమె పోస్టు వైరల్గా మారింది. అయితే మ్యాచ్ భారత్, పాకిస్థాన్ ల మధ్య అయినప్పటికీ ప్లేయర్లు మాత్రం క్రీడాస్ఫూర్తిని కనబరిచారు. మ్యాచ్ సందర్బంగా ఎలాంటి గొడవలు చోటు చేసుకోలేదు. పైగా కోహ్లి పాక్ ప్లేయర్లను మనస్ఫూర్తిగా అభినందించి అందరి మనస్సులను గెలుచుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…