IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022వ ఎడిషన్ మరింత రసవత్తరంగా సాగనుంది. మరో రెండు కొత్త టీమ్లు వచ్చి చేరాయి. బీసీసీఐ సోమవారం సాయంత్రం రెండు కొత్త ఐపీఎల్ టీమ్లను ప్రకటించింది. లక్నో, అహ్మదాబాద్ టీమ్లను ఐపీఎల్లో చేరుస్తున్నట్లు బీసీసీఐ తెలియజేసింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
లక్నో టీమ్ను ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ.7090 కోట్లకు సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ టీమ్ను రూ.5100 కోట్లకు సీవీసీ కాపిటల్ సొంతం చేసుకుంది. కాగా గోయెంకా గ్రూప్ గతంలో ఐపీఎల్కు చెందిన పూణె ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. 2 ఏళ్ల పాటు ఆ టీమ్ కొనసాగింది. తరువాత పలు కారణాల వల్ల ఆ టీమ్ను రద్దు చేశారు.
ఇక టీమ్ ల కోసం అదానీ గ్రూప్, గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, గ్లేజర్ ఫ్యామిలీ, అరబిందో, సీవీసీ కాపిటల్ భారీ ధరలకు బిడ్లను వేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు కోటక్ గ్రూప్, టొరెంట్ గ్రూప్లు కూడా బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అయితే డిసెంబర్ లో ఐపీఎల్ ఆటగాళ్లను మొత్తంగా వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సీజన్లో అన్ని టీమ్ లలోనూ కొత్త ముఖాలు దర్శనమివ్వనున్నాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…