Samantha Naga Chaithanya : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది.. సమంత, నాగచైతన్యల కామన్ స్నేహితుల పరిస్థితి. ఆ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంలో ఆ ఇద్దరికీ కామన్గా ఉన్న స్నేహితులకు ఏమీ పాలుపోవడం లేదట. ఎవరికి సపోర్ట్ ఇస్తే ఎవరు ఏమనుకుంటారోనని వారు సైలెంట్గా ఉంటున్నట్లు తెలుస్తోంది.
సమంత, నాగచైతన్య ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకుని ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. తరువాత వీరు టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎవరికి కన్నుకుట్టిందో.. ఏ దేవుడి శాపమో తెలియదు కానీ.. ఈ ఇద్దరూ విడిపోయారు. అత్యంత బాధతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విడాకుల ప్రకటన అనంతరం సమంత వరుస సినిమాలకు ఒప్పుకుంటూ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తోంది. ఇక నాగచైతన్య కూడా వరుసగా సినిమాలను చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడినుంచి ఇప్పటి వరకు కామన్ గా స్నేహితులు కొందరు ఏర్పడ్డారు. వారు సమంతకు, నాగచైతన్యకు కంబైన్డ్గా స్నేహితులే. ఈ ఇద్దరూ కలసి ఉన్నన్ని రోజులూ ఆ కామన్ ఫ్రెండ్స్ వీరి కార్యక్రమాలకు వెళ్లేవారు. పార్టీలు చేసుకునేవారు. అయితే ఈ జంట విడిపోయాక.. ఆ కంబైన్డ్ ఫ్రెండ్స్ వీరికి దూరంగా ఉంటున్నారట. ఎందుకంటే.. వారు అటు సమంతకే కాక, ఇటు నాగచైతన్యకూ స్నేహితులే కదా. కనుక కంబైన్డ్ ఫ్రెండ్స్ కాబట్టి.. ఇద్దరి నుంచీ దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.
కేవలం సమంత వద్దకో లేదా నాగచైతన్య వద్దకో వెళితే.. తమకు ఎవరు కావాలో వారిని ఎంచుకున్నట్లు అవుతుంది. దీంతో ఇంకొకరికి దూరం కావల్సి వస్తుంది. ఇది ఇష్టం లేకే ఆ కంబైన్డ్ ఫ్రెండ్స్ ఎవరి వద్దకూ వెళ్లడం లేదట. కొంత కాలం పాటు వేచి చూడాలని.. విడాకుల ప్రక్రియ పూర్తయ్యాక.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారట. దీంతో చై, సామ్ల కంబైన్డ్ స్నేహితులకు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి ఉందని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…