Samantha Naga Chaithanya : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది.. సమంత, నాగచైతన్యల కామన్ స్నేహితుల పరిస్థితి. ఆ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంలో ఆ ఇద్దరికీ కామన్గా ఉన్న స్నేహితులకు ఏమీ పాలుపోవడం లేదట. ఎవరికి సపోర్ట్ ఇస్తే ఎవరు ఏమనుకుంటారోనని వారు సైలెంట్గా ఉంటున్నట్లు తెలుస్తోంది.
సమంత, నాగచైతన్య ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకుని ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. తరువాత వీరు టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎవరికి కన్నుకుట్టిందో.. ఏ దేవుడి శాపమో తెలియదు కానీ.. ఈ ఇద్దరూ విడిపోయారు. అత్యంత బాధతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విడాకుల ప్రకటన అనంతరం సమంత వరుస సినిమాలకు ఒప్పుకుంటూ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తోంది. ఇక నాగచైతన్య కూడా వరుసగా సినిమాలను చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడినుంచి ఇప్పటి వరకు కామన్ గా స్నేహితులు కొందరు ఏర్పడ్డారు. వారు సమంతకు, నాగచైతన్యకు కంబైన్డ్గా స్నేహితులే. ఈ ఇద్దరూ కలసి ఉన్నన్ని రోజులూ ఆ కామన్ ఫ్రెండ్స్ వీరి కార్యక్రమాలకు వెళ్లేవారు. పార్టీలు చేసుకునేవారు. అయితే ఈ జంట విడిపోయాక.. ఆ కంబైన్డ్ ఫ్రెండ్స్ వీరికి దూరంగా ఉంటున్నారట. ఎందుకంటే.. వారు అటు సమంతకే కాక, ఇటు నాగచైతన్యకూ స్నేహితులే కదా. కనుక కంబైన్డ్ ఫ్రెండ్స్ కాబట్టి.. ఇద్దరి నుంచీ దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.
కేవలం సమంత వద్దకో లేదా నాగచైతన్య వద్దకో వెళితే.. తమకు ఎవరు కావాలో వారిని ఎంచుకున్నట్లు అవుతుంది. దీంతో ఇంకొకరికి దూరం కావల్సి వస్తుంది. ఇది ఇష్టం లేకే ఆ కంబైన్డ్ ఫ్రెండ్స్ ఎవరి వద్దకూ వెళ్లడం లేదట. కొంత కాలం పాటు వేచి చూడాలని.. విడాకుల ప్రక్రియ పూర్తయ్యాక.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారట. దీంతో చై, సామ్ల కంబైన్డ్ స్నేహితులకు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి ఉందని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…