Sandeep Reddy Vanga : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంటేనే ప్రతిభకు పట్టం గడుతుంది. అలా ఒక్క సినిమా ఛాన్స్ తో లైఫ్ టర్న్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అటు హీరోగా విజయ్ దేవరకొండకు, ఇటు డైరెక్టర్ గా సందీప్ రెడ్డికి కూడా కెరీర్ టర్న్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు.
షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగానే డైరెక్షన్ చేశారు. అలా కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఒక్కసారిగా సందీప్ రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్ గా మారారు. నెక్ట్స్ రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సినిమాను తెరకెక్కించారు. యంగ్ రెబల్ స్టార్ హీరోగా సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్పిరిట్ అనే సినిమాకు డైరెక్షన్ వహిస్తున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా బడ్జెట్ ను 400 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేశారు. అలాగే ప్రభాస్ 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే.. డైరెక్టర్ రెమ్యునరేషన్. ఈ స్పిరిట్ సినిమాలో వచ్చే లాభాల్లో డైరెక్టర్ కి 50 శాతం వాటా ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ తో అగ్రిమెంట్స్ చేసుకున్నారు. స్పిరిట్ సినిమాని స్టార్ట్ చేసేలోగా ప్రభాస్ నాలుగు సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇక విదేశీ మార్కెట్ లో కూడా ప్రభాస్ కు ఉన్న రేంజ్ తో డైరెక్టర్ సందీప్ కెరీర్ కూడా ఓ రేంజ్ లో హిట్ అవుతుందని, ఇక సందీప్ దశ తిరిగిపోతుందనే టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…