Pushpaka Vimanam : విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు. తాజాగా పుష్పక విమానం సినిమాతో ప్రయోగం చేయబోతున్నాడు ఆనంద్. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ఇందులో శాన్వి మేఘన కథానాయికగా నటించింది.
పుష్పక విమానం చిత్రాన్ని నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్ను అల్లు అర్జున్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్ (ఆనంద్ దేవరకొండ) అనే స్కూల్ టీచర్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? అనేది ఆసక్తికరంగా సినిమాలో చూపించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధమైంది.
ఓ ప్రభుత్వ లెక్కల మాస్టారు. పెళ్లి తరువాత సిటీకి వచ్చి సెటిల్ అవుతాడు. పెళ్లైన పది రోజులకే తన భార్య లేచిపోతుంది. భార్య ఇంట్లోనే ఉన్నట్టుగానే అందరినీ నమ్మిస్తాడు. హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తన భార్య చేసిందని స్కూల్లో స్టాఫ్ అందరికీ వడ్డిస్తుంటాడు. అలా తన భార్య ఇంట్లోనే ఉందని నమ్మించేందుకు నానా కష్టాలు పడతాడు. లేచిపోయిందని చెప్పడానికి ఒక్క ఫ్రూప్ చూపించరా ? అని పోలీస్ క్యారెక్టర్లో ఉన్న సునీల్ అడిగితే.. ఆమె రాసిన లెటర్ ఉందంటూ హీరో ఆనంద్ చెబుతాడు. అదెక్కడ అని అంటే.. మింగేసా అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది.
చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. సునీల్, నరేశ్, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…