Pushpaka Vimanam : విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు. తాజాగా పుష్పక విమానం సినిమాతో ప్రయోగం చేయబోతున్నాడు ఆనంద్. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ఇందులో శాన్వి మేఘన కథానాయికగా నటించింది.
పుష్పక విమానం చిత్రాన్ని నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్ను అల్లు అర్జున్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్ (ఆనంద్ దేవరకొండ) అనే స్కూల్ టీచర్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? అనేది ఆసక్తికరంగా సినిమాలో చూపించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధమైంది.
ఓ ప్రభుత్వ లెక్కల మాస్టారు. పెళ్లి తరువాత సిటీకి వచ్చి సెటిల్ అవుతాడు. పెళ్లైన పది రోజులకే తన భార్య లేచిపోతుంది. భార్య ఇంట్లోనే ఉన్నట్టుగానే అందరినీ నమ్మిస్తాడు. హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తన భార్య చేసిందని స్కూల్లో స్టాఫ్ అందరికీ వడ్డిస్తుంటాడు. అలా తన భార్య ఇంట్లోనే ఉందని నమ్మించేందుకు నానా కష్టాలు పడతాడు. లేచిపోయిందని చెప్పడానికి ఒక్క ఫ్రూప్ చూపించరా ? అని పోలీస్ క్యారెక్టర్లో ఉన్న సునీల్ అడిగితే.. ఆమె రాసిన లెటర్ ఉందంటూ హీరో ఆనంద్ చెబుతాడు. అదెక్కడ అని అంటే.. మింగేసా అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది.
చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. సునీల్, నరేశ్, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…