Samantha : నాగచైతన్యతో విడిపోయాక సమంత కొద్ది రోజుల పాటు కాలు బయట పెట్టలేదు. కానీ మొన్నీ మధ్యే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కనిపించి సందడి చేసింది. అందులో తారక్తో కలిసి సమంత సరదాగా పార్టిసిపేట్ చేసింది. అయితే షోలో మునుపటి ఉత్సాహం ఆమెలో కనిపించలేదు. వాడిపోయినట్లు ముఖం కనిపించింది.
ఇక ఇటీవలే సమంత బయట పార్కుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. చైతూ నుంచి విడిపోయాక మానసిక ప్రశాంతత కరువైందని, అందువల్లే ఆమె ఆ విధంగా పచ్చని ప్రకృతిలో గడుపుతుందని తెలుస్తోంది.
ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సమంతను ఎన్టీఆర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. మీ ఫోన్ లో క్విజ్ యాప్స్ ఉంటాయా ? అని తారక్ అడగ్గా.. అందుకు సమంత బదులిస్తూ.. గతంలో ఉండేవని.. కానీ ఇప్పుడు మానసిక ప్రశాంతతను అందించే calming apps ను ఇన్స్టాల్ చేశానని.. ప్రస్తుతం వాటినే ఉపయోగిస్తున్నానని సమంత చెప్పింది. అంటే.. ఆమె చైతూ నుంచి విడిపోయాక.. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టమవుతుంది. కనుకనే ఆమె కామింగ్ యాప్స్ ను వాడుతుందని, పచ్చని ప్రకృతిలో గడుపుతుందని అర్థం చేసుకోవచ్చు.
కాగా తనతో సినిమాలను తీసే దర్శక నిర్మాతలకు కూడా సమంత ఇటీవల కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. తన మూవీ షూటింగ్లను వీలైనంత వరకు హైదరాబాద్ లో కాకుండా చెన్నైలోనే ప్లాన్ చేయాలని సమంత వారికి సూచించిందట. ఇక హైదరాబాద్లో షూటింగ్ చేయాల్సి వస్తే.. ఔట్ డోర్ కాకుండా ఇండోర్లోనే షూటింగ్ చేయాలని కచ్చితంగా చెప్పేసిందట. దీని వల్ల ఫ్యాన్స్ తో అనవసర తలనొప్పి ఎందుకని సమంత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విడాకుల అనంతరం ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…