Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సమంత పోస్ట్ చేసిన అనంతరం ఆమెను చాలా మంది పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే సమంత అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్గా నిలిచారు. ఇక ఆ పోస్ట్కు కామెంట్లను ఆఫ్ చేసింది. తరువాత పెట్టిన కొన్ని పోస్టులకు కూడా కామెంట్స్ను ఆన్ చేయలేదు. దీంతో ఆమె ఈ విడాకుల విషయంపై కొంత ఆందోళనకు గురై, భయపడినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఆమె కామెంట్స్ సెక్షన్ను మళ్లీ తన పోస్ట్లకు ఆన్ చేసింది. దీంతో కొంత వరకు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అక్కినేని కుటుంబానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో సమంత విడాకులు ఇచ్చిందని తెలిసిన ఫ్యాన్స్ సమంతపై మండిపడ్డారు. ఇక కొన్ని సైట్లు, యూట్యూబ్ చానల్స్ అయితే పెద్ద ఎత్తున ఏవేవో వార్తలను ప్రచురించాయి. మరోవైపు సమంతపై వస్తున్న విమర్శలు కూడా ఎక్కువవయ్యాయి. దీంతో అన్నింటికీ సమంత కొంత భయపడే కామెంట్ల సెక్షన్ను ఆఫ్ చేసినట్లు తెలిసింది.
కానీ ఆమె తాజాగా మళ్లీ కామెంట్స్ సెక్షన్ను ఆన్ చేయడంతో కొంత వరకు ఆమెలో ఆందోళన, భయం తగ్గినట్లు అర్థం అవుతోంది. అక్కినేని అభిమానులు కామెంట్స్లో ఏమేం పోస్ట్ చేస్తారోనన్న ఆందోళనతోనే ఆమె కొన్ని రోజుల పాటు కామెంట్స్ సెక్షన్ను ఆఫ్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే సమంత డై హార్డ్ ఫ్యాన్స్.. ముఖ్యంగా మహిళలు మాత్రం సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.
సమంత కామెంట్స్ సెక్షన్ మళ్లీ ఆన్ చేయడంతో ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. నువ్వు మళ్లీ ఎప్పటిలాగే ఈ అలజడి నుంచి బయటకు రావాలని నీకు స్ట్రాంగ్ సపోర్ట్ను ఇస్తున్నాం.. అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రోజులు పోతే ఈ గొడవ అంతా సద్దుమణిగి మళ్లీ ఎప్పటిలాగే అవుతుంది. ఏది ఏమైనా.. ఇన్ని రోజుల పాటు సమంత పడ్డ ఆందోళనకు కొంత రిలీఫ్ వచ్చినట్లే అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…