Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సమంత పోస్ట్ చేసిన అనంతరం ఆమెను చాలా మంది పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే సమంత అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్గా నిలిచారు. ఇక ఆ పోస్ట్కు కామెంట్లను ఆఫ్ చేసింది. తరువాత పెట్టిన కొన్ని పోస్టులకు కూడా కామెంట్స్ను ఆన్ చేయలేదు. దీంతో ఆమె ఈ విడాకుల విషయంపై కొంత ఆందోళనకు గురై, భయపడినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఆమె కామెంట్స్ సెక్షన్ను మళ్లీ తన పోస్ట్లకు ఆన్ చేసింది. దీంతో కొంత వరకు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అక్కినేని కుటుంబానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో సమంత విడాకులు ఇచ్చిందని తెలిసిన ఫ్యాన్స్ సమంతపై మండిపడ్డారు. ఇక కొన్ని సైట్లు, యూట్యూబ్ చానల్స్ అయితే పెద్ద ఎత్తున ఏవేవో వార్తలను ప్రచురించాయి. మరోవైపు సమంతపై వస్తున్న విమర్శలు కూడా ఎక్కువవయ్యాయి. దీంతో అన్నింటికీ సమంత కొంత భయపడే కామెంట్ల సెక్షన్ను ఆఫ్ చేసినట్లు తెలిసింది.
కానీ ఆమె తాజాగా మళ్లీ కామెంట్స్ సెక్షన్ను ఆన్ చేయడంతో కొంత వరకు ఆమెలో ఆందోళన, భయం తగ్గినట్లు అర్థం అవుతోంది. అక్కినేని అభిమానులు కామెంట్స్లో ఏమేం పోస్ట్ చేస్తారోనన్న ఆందోళనతోనే ఆమె కొన్ని రోజుల పాటు కామెంట్స్ సెక్షన్ను ఆఫ్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే సమంత డై హార్డ్ ఫ్యాన్స్.. ముఖ్యంగా మహిళలు మాత్రం సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.
సమంత కామెంట్స్ సెక్షన్ మళ్లీ ఆన్ చేయడంతో ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. నువ్వు మళ్లీ ఎప్పటిలాగే ఈ అలజడి నుంచి బయటకు రావాలని నీకు స్ట్రాంగ్ సపోర్ట్ను ఇస్తున్నాం.. అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రోజులు పోతే ఈ గొడవ అంతా సద్దుమణిగి మళ్లీ ఎప్పటిలాగే అవుతుంది. ఏది ఏమైనా.. ఇన్ని రోజుల పాటు సమంత పడ్డ ఆందోళనకు కొంత రిలీఫ్ వచ్చినట్లే అయింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…