అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల బంధంలో భార్యాభర్తలు జీవితాంతం ఎంతో అన్యోన్యంగా ఉండాలని భావిస్తారు. అయితే కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చి.. ఆమె గుండెపోటుతో మరణించిందని.. అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఆ భర్త అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలకు చెందిన చిత్తలూరు శ్రీనివాస్, సురాంభ దంపతులు. 18 సంవత్సరాల క్రితం రామంతపూర్ వలసవచ్చి ఇద్దరూ కూరగాయల వ్యాపారం చేసుకొనేవారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి శ్రీనివాస్ ఏ విధమైన పనులు చేయకుండా ఖాళీగా ఉండటమే కాకుండా అవసరం కోసం ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని అప్పులు చేసేవాడు. ఈ క్రమంలోనే అప్పు ఇచ్చిన వారు ఇంటి పైకి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది.
ఇలా తరచూ వీరిద్దరూ గొడవపడటంతో భార్యపై ఎంతో కక్ష పెట్టుకున్న శ్రీనివాస్ ఒక రోజు పిల్లలు నిద్రపోతున్న సమయం చూసి తన భార్యను కొట్టాడు. అప్పటికి తన భార్య కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే తన గొంతు నులిమి చంపాడు. ఎవరికీ తెలియకుండా శవాన్ని దహనం చేయాలని అర్ధరాత్రి సమయంలో టాటా ఏస్ లో తన భార్య మృతదేహాన్ని తీసుకుని వెళ్తుండగా తనకు కొడుకు, కూతురు ఫోన్ చేయడంతో కూరగాయల కోసం వెళ్తున్నామని అబద్ధం చెప్పాడు.
అయితే తనని దహనం చేయాలని భావించే సమయానికి తెల్లవారు కావడంతో తన ప్లాన్ రివర్స్ అయ్యింది. ఈ క్రమంలోనే కూరగాయల కోసం అతను వెళ్లగా తన భార్యకు గుండెపోటు వచ్చిందని.. దాంతో తను మరణించిందని నాటకం ఆడాడు. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూసి తమ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయట పడింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…