అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల బంధంలో భార్యాభర్తలు జీవితాంతం ఎంతో అన్యోన్యంగా ఉండాలని భావిస్తారు. అయితే కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చి.. ఆమె గుండెపోటుతో మరణించిందని.. అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఆ భర్త అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలకు చెందిన చిత్తలూరు శ్రీనివాస్, సురాంభ దంపతులు. 18 సంవత్సరాల క్రితం రామంతపూర్ వలసవచ్చి ఇద్దరూ కూరగాయల వ్యాపారం చేసుకొనేవారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి శ్రీనివాస్ ఏ విధమైన పనులు చేయకుండా ఖాళీగా ఉండటమే కాకుండా అవసరం కోసం ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని అప్పులు చేసేవాడు. ఈ క్రమంలోనే అప్పు ఇచ్చిన వారు ఇంటి పైకి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది.
ఇలా తరచూ వీరిద్దరూ గొడవపడటంతో భార్యపై ఎంతో కక్ష పెట్టుకున్న శ్రీనివాస్ ఒక రోజు పిల్లలు నిద్రపోతున్న సమయం చూసి తన భార్యను కొట్టాడు. అప్పటికి తన భార్య కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే తన గొంతు నులిమి చంపాడు. ఎవరికీ తెలియకుండా శవాన్ని దహనం చేయాలని అర్ధరాత్రి సమయంలో టాటా ఏస్ లో తన భార్య మృతదేహాన్ని తీసుకుని వెళ్తుండగా తనకు కొడుకు, కూతురు ఫోన్ చేయడంతో కూరగాయల కోసం వెళ్తున్నామని అబద్ధం చెప్పాడు.
అయితే తనని దహనం చేయాలని భావించే సమయానికి తెల్లవారు కావడంతో తన ప్లాన్ రివర్స్ అయ్యింది. ఈ క్రమంలోనే కూరగాయల కోసం అతను వెళ్లగా తన భార్యకు గుండెపోటు వచ్చిందని.. దాంతో తను మరణించిందని నాటకం ఆడాడు. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూసి తమ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయట పడింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…