Samantha : సినీ ఇండస్ట్రీలో నటీనటులకు, దర్శక నిర్మాతలకు అత్యంత గౌరవమైన పురస్కారం ఆస్కార్. అలాంటి ఆస్కార్ నామినేషన్కు నయనతార, విఘ్నేష్ శివన్ ల సినిమా ఎంపికయ్యింది. కూళంగల్ అనే సినిమాను నయనతార, విఘ్నేష్ శివన్ లు నిర్మించారు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు ఇండియా తరఫు నుండి వెళ్ళడంతో సెలెబ్రిటీలంతా వారికి శుభాకాంక్షలు తెలిపారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ లకు సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.
అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నయనతార ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమాకు తన కాబోయే భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ వహించారు. రీసెంట్ గా ఈ సినిమా ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ సినిమాల కేటగిరిలో ఇండియా నుండి సెలెక్ట్ అయ్యింది. అలాగే నయన్ కు బాలీవుడ్ సినీ హీరో విక్కీ కౌశల్ కూడా విష్ చేశారు. ఆయన నటించిన సర్దార్ ఉద్దమ్ తో పాటు కుళాంగల్ సినిమా కూడా ఆస్కార్ నామినేషన్స్ కు సెలెక్ట్ అవ్వడం విశేషం అంటూ పొగిడారు.
ఇలాంటి మంచి సినిమాల్ని ఆదరించినందుకు నయన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ ని గెలుచుకుంది. వచ్చే సంవత్సరం 2022 మార్చి 22 న 94 వ అకాడమీ అవార్డ్స్ ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్ వేడుకలను అమెరికా లాస్ ఏంజిల్స్ లో డాల్బి థియేటర్ లో సెలెబ్రేట్ చేస్తారు. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…