Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సమంత పలు వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆమె నటించిన సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇక ఇటీవలే పుష్ప సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్లో డ్యాన్స్ చేసిన సమంత అందరినీ.. అలరించింది. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. అంటూ హుషారెత్తించింది.
పుష్ప సినిమాకు సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఐటమ్ సాంగ్స్ చేయాలని ఆఫర్స్ వస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆమె త్వరలో లైగర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది. ఇక సమంత తాజాగా తన సినీ కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి పరిస్థితులను అనుభవించిందో చెప్పుకొచ్చింది.
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సమంత.. తాను సినిమాల్లోకి రాకముందు ఎలాంటి దుర్భర పరిస్థితులను అనుభవించిందో తెలియజేసింది. తాను కాలేజీ టాపర్ అని, అయితే తన తల్లిదండ్రులకు స్థోమత లేనందు వల్ల ఉన్నత చదువులు చదవలేకపోయానని తెలిపింది. అందులో భాగంగానే యాక్టింగ్ కెరీర్ను ఎంచుకున్నట్లు వివరించింది.
అయితే కెరీర్ తొలిరోజుల్లో అనేక పనులు చేశానని.. ఒక్కో సమయంలో అసలు తినడానికి తిండే ఉండేది కాదని.. రోజుకు ఒక్కసారి మాత్రమే తినేదాన్నని స్పష్టం చేసింది. ఎవరైనా అమ్మాయిలు తమ కలలను సాకారం చేసుకునే వరకు విరమించుకోవద్దని, లక్ష్య సాధన దిశగా ముందడుగు వేయాలని ఆమె సూచించింది. కాగా సమంత ప్రస్తుతం కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాతోపాటు శాకుంతలం, యశోద అనే సినిమాల్లో నటించింది. ఈ మూవీలు త్వరలో విడుదల కానున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…